సీనియర్ నటుడు నరేష్ తనయుడు హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'నందిని నర్సింగ్హోమ్'. గిరి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా మొదట పెద్దగా తెలుగు సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించలేకపోయింది. అయితే, సినిమా ఆడియో విడుదల వేడుకతో మొత్తం ఈక్వేషన్స్ మారిపోయాయి ఆడియో విడుదల వేడుకకు సూపర్స్టార్ మహేష్ హాజరు కావడంతో సినిమాగురించి సినీ వర్గాల్లో అంతా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. దీనికి తోడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, తనకు ఈ చిత్రంలో హీరోగా నటించిన నవీన్తో ఉన్న అనుబంధాన్ని చాటుకోవడం, ఎడిటర్గా నవీన్ రిటైర్మెంట్ తీసుకుని, హీరోగా సత్తా చాటాలని ఆకాంక్షించడంతో, రాత్రికి రాత్రి నవీన్ యంగ్ హీరోల రేసులోకి దూసుకొచ్చేశాడు. ముద్దుగుమ్మలు నిత్య, శ్రావ్య ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రచార చిత్రం ఆకట్టుకుంటోంది. ఇంతవరకూ మంచి ఎడిటర్గా పేరు తెచ్చుకున్న నవీన్ విజయ కృష్ణ ఇప్పుడు నటనపై ఇంట్రెస్ట్తో హీరో గెటప్ వేయనున్నాడు. మొదట్నుంచీ కష్టపడే తత్వం నవీన్ది. అదే తనను సక్సెస్ వైపు నడిపిస్తుంది అని మహేష్, నవీన్ని కొనియాడాడు. ఎడిటర్గా తన టాలెంట్ చూపిన నవీన్ ఇప్పుడు హీరోగా తన సత్తా చాటాలనుకుంటున్నాడు. అందుకోసం రెండేళ్లు నటనలోనూ, డాన్సుల్లోనూ, డైలాగ్ డెలివరీలోనూ శిక్షణ తీసుకున్నాడు. ఏదో సినిమా చేశాం అన్నట్లుగా కాకుండా కంప్లీట్ కమిట్మెంట్తో 'నందిని నర్సింగ్హోమ్' సినిమా చేశాడట నవీన్. సూపర్ స్టార్ కృష్ణ కాంపౌండ్ నుండి వచ్చిన మరో హీరోగా నవీన్ మంచి పేరు తెచ్చుకుంటాడని ఆశిద్దాం.
|