‘ఎ ఫిలిం బై అరవింద్’ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన గజల్ శ్రీనివాస్ గాయకుడిగా గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించారని అందరికీ
తెలుసు. సినిమా అవకాశాలు వస్తున్నా, మంచి పాత్రలు చేయాలని, ఆచి తూచి అడుగు వేయాలనుకునే గజల్ శ్రీనివాస్లో సామాజిక బాధ్యత కాస్త ఎక్కువ. దేశ విదేశాల్లో తిరిగి, గజల్స్ పాడటం ద్వారా పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు గజల్ శ్రీనివాస్. ఏడాదికి రెండు సినిమాల్లో నటించాలని, అవి కూడా సామాజిక బాధ్యతతో కూడుకున్న సినిమాలై వుండాలని అనుకుంటున్నారాయన అని ఇదివరకే చెప్పుకున్నాం.
గజల్ శ్రీనివాస్ ప్రస్తుతం సమైక్య ఉద్యమంలో బిజీగా ఉన్నారు. ఈ ఉద్యమం నేపథ్యంలోనే సమైక్యాంధ్ర కవి గాయక సదస్సు ఒకటి నిర్వహిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో. ఆగస్ట్ 27న ఈ సదస్సు జరగనుంది. ఓ సదుద్దేశ్యంతో సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నా తప్ప, ఎవర్నీ వ్యతిరేకించడానికి కాదని సమైక్య వాదం అంటే అందులో తెలంగాణ వారి పట్ల మమకారమే ఉంటుందని అంటారాయన.
|