మెగా రాకుమారుడు వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'మిస్టర్'. డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం శ్రీను వైట్ల డైరెక్షన్లో వస్తోంది. వచ్చే నెల 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ అనుకుంది. అయితే అంతకు ఒక రోజు ముందే, అంటే ఏప్రిల్ 13న ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారట. ఒక పాట మినహా మిగతా షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యిందట. ఇటలీలో ఈ లాస్ట్ సాంగ్ని చిత్రీకరించనుందట చిత్ర బృందం. సినిమా అంతా చాలా రిచ్గా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ద్వారా ఈ విషయం తెలుస్తోంది. భారీ లొకేషన్లు, కొత్త కొత్త ప్లేసులు ట్రైలర్లో చూపించిన విధానం చాలా అట్రాక్టివ్గా ఉంది. ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రేమ ప్రయాణంతో ఆధ్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. రెండు డిఫరెంట్ షేడ్స్లో కనిపిస్తున్నాడు వరుణ్ తేజ్ ఈ సినిమాలో. ఈ సినిమాతో కామెడీలోని కొత్త యాంగిల్ని పరిచయం చేయనున్నాడట డైరెక్టర్ శ్రీను వైట్ల. మూస కథ కాకుండా కొత్త రకం లవ్ స్టోరీని చూపిస్తానంటున్నాడు శ్రీను వైట్ల. అన్నట్లు ఈ సినిమాలో బకరా ఎవరూ ఉండరట కూడా. ఇంతవరకూ ముచ్చటగా మూడు సినిమాలతో మూడు రకాల పాత్రలతో ఆకట్టుకున్న వరుణ్ తేజ్కి నాలుగో సినిమాగా వస్తోన్న చిత్రమిది. ఈ చిత్రంతో వరుణ్ మెగా ఫ్యాన్స్ని ఎలా ఆకట్టుకుంటాడో చూడాలిక.
|