ఎలక్షన్స్ సీజన్ కారణంగా కొన్ని సినిమాలు వెనక్కి వెళ్లాయి. ఇక ఇప్పుడు ఎలక్షన్స్ సీజన్ ముగిసింది. సినిమాల జాతర మొదలైంది. 'మజిలీ'తో ఆల్రెడీ బోణీ కొట్టేసింది బాక్సాఫీస్. సమంత, నాగచైతన్య జంటగా తెరకెక్కిన 'మజిలీ' మంచి టాక్తో రన్ అవుతోంది. తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్తేజ్ నటించిన 'చిత్రలహరి' విడుదలకు సిద్ధమవుతోంది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణీ ప్రియదర్శన్, నివేతా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది 'చిత్రలహరి'. తర్వాత నితిన్ సిద్ధార్ద్ హీరోగా 'అర్జున్ సురవరం', నాని హీరోగా 'జెర్సీ' సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. మధ్యలో డబ్బింగ్ చిత్రం 'కాంచన 3' కూడా విడుదల కానుంది. ఇవి ఫిక్స్డ్ డేట్స్. ఇక ఎలక్షన్స్ కారణంగా కొన్ని సినిమాలు ఆల్రెడీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాకనే వాయిదాలు పడ్డాయి.
ఆ సినిమాలు కూడా స్లాట్ బుక్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. మొత్తానికి బాక్సాఫీస్పై మూకుమ్మడి దండయాత్రకు సిద్ధమైన వరుస సినిమాలు బాక్సాఫీస్కి కాసుల వర్షం కూడా కురిపించాలని కోరుకుందాం. ఇదిలా ఉంటే, మే లో పెద్ద సినిమా 'మహర్షి' విడుదల కానుంది. ఈ సినిమాపై బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలున్నాయి. ఆ తర్వాత సంచలన హీరో విజయ్ దేవరకొండ నటించిన 'డియర్ కామ్రేడ్' తదితర చిత్రాలూ లైన్లో ఉన్నాయి.
|