Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
o baby

ఈ సంచికలో >> సినిమా >>

మూడో గది కోసం జాగ్రత్త పడిన డైరెక్టర్‌.!

Careful Director.!

ఓంకార్‌ అన్నయ్యగా బుల్లితెరపై యాంకరింగ్‌లో తనదైన స్టైల్‌ ప్రదర్శించిన ఓంకార్‌ 'రాజుగారి గది' సినిమాతో డైరెక్టర్‌ అయిపోయాడు. తన తమ్ముడు అశ్విన్‌ బాబును హీరోగా పెట్టి తెరకెక్కించిన ఈ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఊహించని వసూళ్లు ఈ సినిమాతో దక్కించుకున్నాడు మన ఓంకార్‌ అన్నయ్య. తొలి సినిమాకి ఈ రేంజ్‌లో సక్సెస్‌ అందుకున్నాక మన ఓంకార్‌ అన్నయ్య ఊరుకుంటాడా.? ఇదే సినిమాకి సీక్వెల్‌ రూపొందించాడు. అయితే, రెండో సీక్వెల్‌కి కాస్త ఓవరాక్షన్‌ ఎక్కువ చేశాడు మన ఓంకార్‌ అన్నయ్య. అసలే అది కాస్త ఎక్కువ. ఇక డైరెక్టర్‌గా తొలి సినిమా ఆ రేంజ్‌లో హిట్‌ అయ్యేసరికి స్టార్స్‌తో రెండో పార్ట్‌ని తెరకెక్కించాలనుకున్నాడు.

ఏకంగా నాగార్జున వంటి స్టార్‌ హీరో ఈ సినిమాలో నటించేందుకు ముందుకు రావడంతో సినిమాకి హైప్‌ పెరిగింది. తర్వాత సమంత గ్లామర్‌ కూడా తోడవడంతో సినిమాపై బాగ అంచనాలు పెరిగాయి. భారీ బడ్జెట్‌ ఖర్చు పెట్టేశాడు. కానీ సినిమా తుస్సుమంది. దాంతో మూడో పార్ట్‌ విషయంలో కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నాడట. స్టార్స్‌ జోలికి వెళ్లడం లేదట. కానీ, తమన్నా ముఖ్య పాత్రలో ఈ సీక్వెల్‌ రూపొందుతోంది. బడ్జెట్‌ విషయంలో జాగ్రత్త పడుతున్నాడు. లిమిటెడ్‌ బడ్జెట్‌తో లో ప్రొఫైల్‌లో ఈ సినిమాని రూపొందిస్తున్నాడట. తొలి, రెండు పార్ట్‌ల్లో నటించిన అశ్విన్‌బాబు ఈ పార్ట్‌లోనూ నటిస్తున్నాడు. కానీ, పూర్తి స్థాయి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కాన్సెప్ట్‌గానే ఈ సీక్వెల్‌ రూపొందిస్తున్నాడట. తక్కువ బడ్జెట్‌ అయినా, నిర్మాణ విలువల పరంగా రిచ్‌గా ఉండేలా చూస్తున్నాడట డైరెక్టర్‌ ఓంకార్‌. లేటెస్ట్‌గా ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్‌ షూటింగ్‌లో బిజీ అయిపోయింది. సొంత నిర్మాణంతో ఓంకార్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. చోటా.కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, బుర్రా సాయి మాధవ్‌ మాటలందిస్తున్నారు. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam