తెలుగులో ఇప్పుడు టాప్ హీరోయిన్ ఎవరు? అంటే, చెప్పడానికి చాలా పేర్లే వున్నాయి. అయితే, ఇటీవలి కాలంలో ఏ కొత్త సినిమా షురూ అవుతున్నా, అందులో హీరోయిన్గా ఫస్ట్ పరిశీలనలోకి వస్తోన్న పేరు మాత్రం రష్మిక మండన్నదే. ఈ కన్నడ కస్తూరి, తెలుగులోకి 'ఛలో' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకునే టైమ్ కూడా లేకుండా పోయింది. 'దేవదాసు', 'గీత గోవిందం'.. ఇలా చాలా బిజీ అయిపోయింది. విజయ్ దేవరకొండతో రెండోసారి 'డియర్ కామ్రేడ్' కోసం జతకట్టింది. ఇంతలోనే, మహేష్తో 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాలో ఛాన్స్ వచ్చింది.
మరోపక్క నితిన్తో 'భీష్మ' చేస్తోంది. అల్లు అర్జున్ సరసన కూడా ఓ సినిమా ఫైనలైజ్ అయిపోయిందామెకి. చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే వుంది. చేస్తున్నవీ, చేయబోతున్నవీ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులే గనుక.. నెంబర్ వన్ ఛెయిర్ రష్మికకి ఎంతో దూరం లేదనిపిస్తుంది. 'డియర్ కామ్రేడ్' మ్యూజిక్ ఫెస్టివల్ పేరుతో నాలుగు ప్రధాన నగరాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తే, వాటిల్లో రష్మిక నాన్ స్టాప్ పెర్ఫామెన్స్లతో అదరగొట్టేసింది. ఆమె ఎనర్జీని చూసి అంతా అవాక్కయ్యారు. ఓ పక్క వరుస సినిమాలతో బిజీగా వున్నా, సినిమా ప్రమోషన్స్ విషయంలో అస్సలేమాత్రం అలసత్వం చూపని రష్మిక కమిట్మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది టాలీవుడ్లో. తమిళంలోనూ రష్మికకి మంచి ఛాన్సులొస్తున్నాయ్. సో, అతి త్వరలో రష్మిక మండన్ననని మనం నెంబర్ వన్ హీరోయిన్గా చూడబోతున్నామన్నమాట.
|