ఈ సంక్రాంతికి రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిల్లో మొదటిది సుకుమార్ దర్శకత్వం వహించగా మహేష్ హీరోగా నటించిన ‘1’. రెండవది వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామచరణ్ హీరోగా వచ్చిన ‘ఎవడు’. రెండు సినిమాలపైనా భారీ అంచనాలు ఉన్నాయి అవి విడుదల కాక మునుపు. అయితే ‘1’ సినిమాపై ఇంకా ఎక్కువ అంచనాలుండేవి.
సినిమా విడుదలైన తర్వాత ‘1’ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చింది. కాని ఓవర్సీస్లో సినిమాకి మంచి స్పందన లభిస్తున్నది. అదే ‘ఎవడు’ ఓవర్సీస్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది, ఇండియాలో ఈ సినిమాకి ప్రేక్షకాదరణ లభిస్తున్నది. ‘1’ భిన్నమైన కాన్సెప్ట్తో రాగా, ‘ఎవడు’లో కొన్ని ఎలిమెంట్స్ కొత్తగా ఉన్నా, ఓవరాల్గా చూస్తే ఫార్ములా మాస్ సినిమాగానే టాక్ సంపాదించుకుంది. అందుకనే ఇండియాలో ఈ సినిమా పాస్ అయ్యింది. ఓవర్సీస్లో ‘1’కి పాస్ మార్కులు దక్కుతున్నాయి.
ఓవర్సీస్లో ‘1’తో మహేష్ స్టామినా ప్రూవ్ కాగా, చరణ్ స్టామినా ఇక్కడ ఇంకోసారి నిరూపితమైందని చెప్పవచ్చు. అలా అక్కడ ‘1’, ఇక్కడ ‘ఎవడు’ ఈ సంక్రాంతి విజేతలుగా చెప్పుకోవలసి ఉంటుంది.
|