శ్రీ చాముండేశ్వరీ దేవి ఫిల్మ్ ఎంటర్ టైన్ మెంట్స్ బానర్ పై పృద్వి ప్రసాద్, దివ్య ప్రతిభ, ముంతాజ్ హీరో, హీరోయిన్లుగా కిషన్ రాఝ్ దర్శకతవం లో ప్రసాద్ బాబు, మధు బాబు సం యుక్తంగా నిర్మిస్తున్న "ప్రియా... నీ మీదే ఆశగా..." చిత్రం ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుని జూన్ 6న విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సంధర్భంగా నిర్మాత ప్రసాద్ బాబు చిత్ర విశేషాలను తెలియజేస్తూ... " సమాజం లో జరుగుతున్న యధార్థ సఘటనల నేపద్యంగా ఈ చిత్ర కథను రూపొందించడం జరిగింది. యూత్ కు కావల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. జయంత్ సంగీతం అందించిన ఆడియో ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ వస్తోంది. హీరో, హీరోయిన్లు మంచి పర్ఫార్మెన్న్స్ ఇవ్వడంతో బాటు దర్శకుడు కిషన్ రాజ్ అద్భుతంగా తెరకెక్కించాడు. జూన్ 6న అత్యధిక థియేటర్స్ లో సినిమాను విడుదల చేస్తున్నాం" అన్నారు.
దర్శకుడు కిషన్ రాజ్ మాట్లాడుతూ... లవ్ అండ్ యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అన్ని ఎలిమెంట్స్ జోడించి ఫ్యామిలీ అంత కలిసి చూసే విధం గా తెరకెక్కించాము.ప్రతీ పాత్రకి ఎంతో ప్రాధాన్యత వుంటుంది. హీరో క్యరెచ్టైజేశన్ చాలా కొత్తగా వుంటుంది. ఇందులో వున్న ఐదు సాంగ్స్ కు జయంత్ అద్భుతమైన బాణీలు అందించారు. ఒక టీం లా అందరం ఈ సినిమాకు కష్ట పడ్డాం. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైసె కాకుండా మాకు అన్ని విఢాలా సహకరించారు. నిర్మాతలు నాపై పెట్టిన నమ్మకాన్ని నూరు శాతం నెరవేర్చాను." అన్నారు
ఈ చిత్రం లో పృద్వి ప్రసాద్ హీరోగా, దివ్య ప్రతిభ, ముంతాజ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం లో కొండ వలస చిత్రం స్రీను, షోనీ, ఆజాద్, రమేష్, నిఖిల్, శేషు ముఖ్య పాత్రలను పోషించారు.
ఈ చిత్రానికి సంగీతం: జయంత్, కెమెరా: జి.ఎల్.బాబు, సమర్పణ: మద్దెల లక్ష్మి రాంబాబు, నిర్మాతలు: ప్రసాద్ బాబు, మధు బాబు, కథ, మాటలు, స్కీన్ ప్లే, దర్శకత్వం: కిషన్ రాజ్
|