ఎవరికీ కాంప్లిమెంటరీ పాస్లు ఇవ్వడంలేదని ‘మేముసైతం’ ప్రోగ్రామ్ గురించి సినీ తారలు స్పష్టంగా చెప్పారు. సినిమా కార్యక్రమం అనగానే కాంప్లిమెంటరీ పాస్ల గురించి ఆలోచన చేస్తారు. అభిమానుల్ని పిలిచి హంగామా చేయనిదే సినిమా కార్యక్రమం అవదు. కాని ‘మేము సైతం’ సినిమా కార్యక్రమం కాదు కదా. తమను స్టార్స్ని చేసిన అభిమానులు కష్టాల్లో వున్నందున, వారిని ఆదుకునేందుకు చేస్తున్న గొప్ప కార్యక్రమం కాబట్టి, కాంప్లిమెంటరీ పాస్లు ఆశించవద్దని సినీ ప్రముఖులు చెప్పారు.
లక్ష రూపాయలు చెల్లించి తొలి టిక్కెట్ని అల్లు అరవింద్ కొనుగోలు చేశారు. సినీ నిర్మాత అశోక్కుమార్ ఓ టిక్కెట్ని కొనుగోలు చేయడం జరిగింది. 250 జంటల కోసం ఈ లక్ష రూపాయల టిక్కెట్లను ఏర్పాటు చేశారు. ఇది టాక్స్ ఫ్రీ అని చెప్పారు నిర్మాత సురేష్బాబు. గొప్ప ఆలోచన చేసిన సినిమా ప్రముఖులు, తాము కూడా టిక్కెట్లు కొనుక్కునే ‘మేముసైతం’లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పడాన్ని అభినందించాలి.
‘మేముసైతం’ కార్యక్రమం ద్వారా పెద్ద మొత్తాన్ని సేకరించి, దాన్ని తుపాను బాధితులకు అందించేలా ప్రణాళిక రచించిన తెలుగు సినీ పరిశ్రమకు అభినందనలు తెలపడం ప్రతి ఒక్కరి బాధ్యత. సినిమా చూసేవారి అభిమానాన్ని క్యాష్ చేసుకోవడం మాత్రమే కాదు, అవసరమైన సందర్భంలో ప్రేక్షక దేవుళ్ళను ఆదుకోవడానికీ ముందున్నామని నిరూపిస్తున్నారు. హేట్సాఫ్ టు టాలీవుడ్.
|