దాసరి నారాయణరావు దర్శకుడిగానే కాక నిర్మాతగానూ అనేక విజయాలు చూసిన వ్యక్తి. సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు. నటుడిగానూ దాసరి నారాయణరావు తెలుగు చలన చిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారు. అలాంటి దాసరి తారక ప్రభు ఫిలింస్ బ్యానర్పై పవన్కళ్యాణ్తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారనే వార్త తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది.చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారో ఇంకా స్పష్టత లేదు. పూరి జగన్నాథ్తో దాసరి ఈ సినిమా నిర్మించవచ్చంటున్నారు. పవన్కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తారనే ప్రచారం కూడా ఉంది. ‘గబ్బర్సింగ్`2’ తర్వాత పవన్ కళ్యాణ్ చేసే సినిమా దాసరి బ్యానర్లోనే ఉంటుంది. దర్శకుడెవరనేదానిపైన కూడా కొన్ని రోజుల్లో స్పష్టత రావచ్చు.దర్శకుడు ఎవరైనాసరే, సినిమా ప్రెస్టీజియస్గానే ఉంటుంది. ఎందుకంటే, పవన్కళ్యాణ్తో చేసే సినిమాని దాసరి నారాయణరావు అంత తేలిగ్గా తీసుకోరు కాబట్టి. తెలుగు సినిమా గత రికార్డుల్ని తిరగరాసేదిగా తమ కాంబినేషన్లో మూవీ ఉండాలని దాసరి భావిస్తున్నారట. సంపత్ నంది పేరు కూడా వార్తల్లోకి ఎక్కుతోంది. సంపత్ నంది, పవన్తో ‘గబ్బర్సింగ్`2’ చేయాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల సంపత్ నంది ఆ ‘గబ్బర్సింగ్`2’ నుంచి తప్పుకున్నాడు.
|