గుణ పాఠం - డా.కె.ఎల్.వి.ప్రసాద్

గుణ పాఠం తెలివి మీరిన ఆధునిక జంటకు గుణపాఠం నేర్పిన  ----------------------------------------------------------------- ఒక నిరక్ష్యరాస్యురాలి కథ ‘కాలని తెప్ప ‘ (కథా సమీక్ష ) ----------------------------------------------------------------------                            —డా . కె . ఎల్ . వి . ప్రసాద్ .                                  *** సామెతలు జీవితంనుండే పుడతాయని చెప్పడానికి మన మధ్య అనేక  ఉదాహరణలు వున్నాయి . అవి ఈనాటివి కావు ,ఎప్పుడో పెద్దలు మనకు అందించిన జీవిత సత్యాలు . అవి ఈనాడే కాదు ఏనాటికైనా మన సమాజానికి వర్తిస్తాయి . అందుకే అలంటి సామెతలకు మరణం ఉండదు .  ఇవి మనకు హితభోదచేస్తాయి . మన జీవితవిధానాన్ని మార్గదర్శనం చేస్తాయి . నీతి సూత్రాలను బోధిస్తాయి . మన జీవితానికి అవసరమైన హెచ్చరికలు చేస్తాయి . అందుకే తరాలు మారినా ,సామెతలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి . పరిశుద్ధగ్రంధంగా చెప్పబడే ‘ ది బైబిల్ ‘ లో  ‘ సామెతలు ‘ అనే పెద్ద అంకమే వుంది . దీనిని బట్టి సామెతలు కొన్ని వేల సంవత్సరాలనుండి మనతోటె కలసి నడుస్తున్నాయని చెప్పక తప్పదు . గ్రామాలలో కాస్త పెద్దమనుష్యులు అనుకున్నవాళ్ళు ,ఎలాంటి  విషయాలు మాట్లాడినా ,ఒకటో రెండో ,అనుకూలమైన సామెతలు వాళ్ళ మాటల్లో దొర్లుతాయి . మనం మాట్లాడే మాటలకు ఆ .. సామెతలు జీవం పోస్తాయి ,జ్ఞాన దృష్టిని ప్రసాదిస్తాయి .  ఆంధ్రరాష్ట్రం లో (ఇప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడి - పోయిన ,నేపథ్యంలో )ఒకానోక సామెత అందరి నోళ్ళల్లోనూ నానుతుం– టుంది . తెలంగాణా ప్రాంతంలో కూడా ప్రాచుర్యంలో వుండి ఉండవచ్చు .  అదేమిటంటే .’’ రేవు దాటి తెప్ప తగలేశాడు ‘’ అని . రేవు అంటే ఒక వెడల్పైన నీటి కాలువకు ,ఇరువైపులా వుండే ఒద్దు . కాలువ దాటడానికి  ఒక బల్లను ,లేదా ‘ బల్ల కట్టు’ ను ఒకవైపు కాలువ వడ్డున బందించి ,కాలువ దాటడానికి (వంతెనలు లేని చోట )ఉపయోగిస్తారు . నిజానికి తెప్ప అంటే ఎలాంటి హంగు ఆర్భాటాలు లేని ఒక బల్ల అంతే !ఇప్పుడు వంతెనలు వచ్చాక చాలా మట్టుకు తెప్పలు కనుమరుగైనట్టే !అయితే ఈ సామెతకు అర్ధం ఇంచుమించు అందరికీ తెలిసిందే ! ఉపయోగానికి వాడుకుని ,అది తీరిన తర్వాత తెప్పను తగలేయడం . అంటే అవసరం ఉన్నంత వరకూ మనిషిని వాడుకుని ,తర్వాత ఏమీ తెలియనట్టు ప్రవర్తించడం . అదిగో .. అలాంటి భావాన్ని కథా వస్తువుగా తీసుకుని  చక్కని కథగా అల్లారు ,కథ /నవల .రచయిత్రి డా . అమృత లత గారు .  అమృతలత గారు ,షుమారు 1969 ప్రాంతం నుండి ,రచనా వ్యాసంగం లో వున్నారు . వారి కథ సంపుటి ‘ స్పందన ‘ లోని, ఒక కథ ఇది . కథ పేరు  ‘ కాలని తెప్ప ‘ కథ పేరు చూడగానే ,కథలో ఏముందో అని ,పాఠకుడు  త్వరగా కథను చదివే ప్రయత్నం చేస్తాడు . పాఠకుడి ఊహకు భిన్నంగా  ఉంటుంది . ఇక్కడ రేవుదాటి తెప్ప తగలేస్తే ,అది కాలనీ పరిస్థితి ,అంటే సహాయం తీసుకుని ,వారికి సహాయం చేయవలసిన పరిస్థితి వచ్చినప్పు డు ,అది బెడిసి కొట్టడం ఈ కథలోని ముఖ్యాంశం .  ఈ కథ ముఖ్యంగా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది . ఆ ముగ్గురూ ఎవరంటే ,ధనికుడైన రాజేష్ ,ఈత చాపలు అల్లి ఇంటింటా తిరిగి అమ్ము– కునే పేద స్త్రీ లచ్చి ,రాజేష్ భార్య విమల . రాజేష్ కు ఆడవాళ్ళ పిచ్చి . నగ్నచిత్రాలు ,బ్లూ ఫిలిమ్స్ ,చూడడం అలవాటు . అందమైన ఆడదాన్ని  చూడగానే సర్వం మరచిపోయే మగాడు . ఒకరోజు ,రాజేష్ -విమల ఒక పెళ్లి కి కారులో దూరప్రాంతం పాలుత్రాగే వయసున్న చంటి బిడ్డతో బయలు దేరుతారు . మార్గమధ్యంలో ,జనసంచారం లేని ప్రదేశంలో అతని కళ్ళకు అతనికి ఇష్టమైన ఒక సుందర దృశ్యం కనబడుతుంది . అదేమిటో  రచయిత్రి వర్ణనలోనే పరిశీలిద్దాం .  ‘’ ఎదురుగా ఈత ఛాపొకటి చుట్టి ,దాన్ని నెత్తిమీద పెట్టుకుని ,నడుంకి  పిల్లాడ్ని కట్టుకుని ,ఒకరొమ్ము వాడి నోటికప్పగించి రెండు చేతుల్తో చక  చకా ఈతాకుల చాపనల్లుతూ ,నిర్విచారంగా నడిచి వస్తోంది లచ్చి ‘’ఇంత టి దృశ్యం కనిపిస్తే రాజేష్ కారు ముందుకు పోతుందా !అంతమాత్రమే కాదు ,రచయిత్రి అక్షరాల్లో లచ్చి ఇలావుందో చూడండి .  ‘’ పిటపిటలాడుతున్న తెల్లటి ఒళ్ళూ ,తైల సంస్కారం లేకున్నా వంకీలు తిరిగి ఓ వింత సోయగాల్ని స్తున్న జుత్తు ,ఓహ్ .. బిచ్చగత్తెల్లో కూడా  ఇంత అందమైన మనుష్యులుంటారా ‘’ అన్న ఆలోచన రావడమే తరువాయి కారు ఆగిపోయింది . భార్య విమలకు కారు ట్రౌబుల్ ఇచ్చిందని అందంగా అబద్దం ఆడేశాడు . ఆ ప్రాంతం లో ఎక్కడా ఇళ్ళులేవు ,ఎర్రటి ఎండ. పిల్లవాడి పోతపాలు అప్పటికే నిండుకున్నాయి  ఆకలికి చంటి బిడ్డ ఏడ్వలేక ఏడుస్తున్నాడు . విమలకు ఏమీ తోచని పరిస్థి . రాజేష్ మాత్రం లచ్చి అందాలను కళ్ళతో కసిగా జుర్రుకుంటున్నా డు . లచ్చి పిల్లవాడి ఏడుపు పాలకోసం అనితెలిసి ,విమలను ఒప్పించి  వాళ్ళ పిల్లవాడికి స్తన్యం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది . కానీ అంతకుముందే  స్వాంతపిల్లవాడికి పాలిచ్చి ఉండడం వల్ల విమలకొడుకు పాలు రాక ఏడుస్తూనే ఉంటాడు . అప్పుడు చేసేదిలేక లచ్చి ముంతలోని గంజి తాగిం చి ,పిల్లవాడికి ఉపశమనం కలిగిస్తారు . రాజేష్ ఏదో కారు మరమ్మత్తు చేసినట్టు ఫోజుకొట్టి కారు స్టార్ట్ చేస్తాడు .  తిరుగు ప్రయాణంలో చీకటి పడుతుంది . లచ్చి కనిపిస్తే బావుణ్ణు అనుకుంటాడు రాజేష్ . ఈసారి నిజంగానే కారు పాడై ఆగిపోతుంది . అనుకోకుండా లచ్చి ,ఇంటికి వస్తూ ఆగిపోయిన కారును గుర్తించి ,వారికి  సహాయంచేస్తుంది . నిర్మానుష్యంగా వున్నదారిలో ఇంటికి వెళ్ళడానికి భయపడి ,తన ఇంటిదగ్గర వదిలివెళ్లామని రాజెష్ ను వేడుకుంటుంది . రాజేష్ -విమల ,మాయమాటలు చెప్పి చేతిలో పదిరూపాయలు పెట్టి  కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోతారు . ఆ చీకటిలో లచ్చి ఏమి చేసింది అన్నది తెలియాలంటే కథ మొత్తం చదివి తీరాలిసిందే . రచయిత్రి కథకు ఆ పేరు ఎందుకు పెట్టారన్నది కూడా తెలుస్తుంది .  మంచి విషయాన్ని రచయిత్రి కథగా మలిచిన తీరు అద్భుతం ,ప్రశంశనీ యం . ఇటువంటి మంచి కథలు ఈ ‘ స్పందన ‘ కథా సంపుటిలో మరో  పద్దెనిమిది ఉన్నాయి . అన్ని కథలూ చదివి తీరాల్సిందే . ఈ కథా సంపుటి కావలసిన వారు రచయిత్రి మొబైల్ నం (9848848866) కు  సంప్రదించి పొందవచ్చును . పుస్తకం  వెల 150/-మాత్రమే .                                         ***

మరిన్ని వ్యాసాలు

బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మీకు తెలియని నాటి నట,గాయని
మీకు తెలియని నాటి నట,గాయని
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
తెలుగు సినీ కృష్ణుడు రఘరామయ్య.
తెలుగు సినీ కృష్ణుడు రఘరామయ్య.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గాయని రమోలా.
గాయని రమోలా.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Paata
పాట
- M chitti venkata subba Rao