Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajayadevam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

siirasri question

1. ఏ రంగం లో అయినా అభివృద్ధి  కావాలంటే పోటీ వాతావరణం వుండాల్సిందే..! పోటీ వున్నప్పుడు నెగ్గాలనే పంతం సహజం. ఆ పంతం లోంచి వచ్చే వాటిల్లో ఒత్తిడి కూడా ఒకటి. ఈ సూత్రం చదువులకి కూడా వర్తిస్తుంది. ఎవరో ఒకరిద్దరు ఎక్కడో ఒక చోట ఒత్తిడి భరించలేక ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని మొత్తం విద్యా వ్యవస్థలోనే మార్పు రావాలని కోరుకోవడం సమంజసం కాకపోవచ్చు. 
 

2. ఎంత గొప్ప అభివృద్ధి అయినా చదువులైనా ప్రాణాలకంటే ఎక్కువ కాదు. పోటీ వుండొచ్చు కాని మరీ పసిప్రాణాలు తట్టుకోలేనంత భారాలను, టార్గెట్లను వారి మీద మోపడం మంచిది కాదు.  ఎక్కడో ఒకచోటైనా ఎవరో ఒకరిద్దరే అయినా నేలరాలే విద్యాకుసుమాల తల్లిదండ్రుల గర్భశోకం ఎవరూ తీర్చలేనిది. లోటు పూడ్చ లేనిది. ఒత్తిడి లేని చదువులో కూడా అభివృద్ధి వుంటుంది. కనుక కచ్చితంగా బోధనా పద్ధతుల్లోనూ ,  విధ్యావ్యవస్థ లోనూ మార్పు వచ్చి తీరాల్సిందే..!     

 

పై రెండిట్లో ఏది కరెక్ట్ ? 

మరిన్ని శీర్షికలు
uttarakhand