అప్పట్లో వరుసగా తాప్సీకి హీరోయిన్గా అవకాశాలు ఇచ్చింది మంచు కుటుంబం. తాప్సీ మనోజ్తో ‘రaుమ్మంది నాదం’ చిత్రంలోనూ, విష్ణుతో ‘వస్తాడు నా రాజు’ సినిమాలోనూ హీరోయిన్గా నటించింది. తాప్సీ తర్వాత ఇప్పుడు మంచు హీరోలతో వరుసగా సినిమాల్లో నటించే ఛాన్స్ రెజీనా కొట్టేసింది. మంచు మనోజ్ మరియు విష్ణుల సరసన ఒకేసారి హీరోయిన్గా నటించబోతోంది. ముప్పరాజు హనుమాన్ దర్శకత్వంలో మంచు విష్ణు కధానాయకుడుగా ఒక సినిమా తెరకెక్కబోతోంది.
ఇందులో రెజినా హీరోయిన్. ఈ సినిమాకు రాజ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారట. మరోవైపు దశరధ్, మంచు మనోజ్ల కలయికలో మరో సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో కూడా రెజీనానే హీరోయిన్గా ఎంపికయ్యింది. ఈ సినిమాలో ప్రకాష్రాజ్ది కీలకపాత్ర. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలో సాయి ధరమ్తేజికు జంటగా నటిస్తోంది. సాయిధరమ్ తేజ నటించిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’లో రెజినా హీరోయిన్గా నటించి మెప్పించింది.
|