ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్ తొలి సినిమా 'కంచె'తోనే కుర్రకారు గుండె కంచెల్ని తెంచేసింది. తన అందంతో, అనుకువతో అందర్నీ కట్టి పాడేసింది ఈ ముద్దుగుమ్మ. క్లాసీ లుక్స్తో కుర్రకారు హృదయాల్ని దోచేసింది. అలాంటి ముద్దుగుమ్మ ఆ తర్వాత కూడా అలాంటి క్యారెక్టర్స్లోనే నటించింది. 'ఓం నమో వేంకటేశాయ' వంటి సినిమాలోనూ భక్తురాలి పాత్రలో నటించి మెప్పించింది. కానీ ఇప్పుడు అమ్మడికి కృష్ణవంశీ సినిమా ద్వారా గ్లామర్ పాత్రలో కనిపించే అవకాశం దక్కింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్లో అమ్మడి అందాల ఆరబోతకి షాకవ్వడమే అందరి వంతౌవుతోంది.
ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న 'నక్షత్రం' సినిమాలో తన బికినీ సొగసులతో కిర్రాకు పుట్టిస్తోంది. పోలీసాఫీసర్ పాత్రలో సాయి ధరమ్ తేజ్కి జంటగా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఓ పక్క ధీర వనితలా పోరాట ఘట్టాల్లో దుమ్ము రేపుతూనే, మరో పక్క గ్లామర్తోనూ చంపేస్తోంది. గతంలో ఈ ముద్దుగుమ్మ ఫైట్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవన్నీ ఈ సినిమా కోసమే. అయితే ఈ సినిమాలో అమ్మడిది గెస్ట్ రోలే అన్నారు కానీ, ప్రాధాన్యత ఉన్న పాత్రలా అనిపిస్తోంది. ట్రైలర్లో చాలా సన్నివేశాల్లో ప్రగ్యా అలరిస్తోంది. సందీప్ కిషన్, రెజీనా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ సినిమాలో. త్వరలోనే ప్రేక్షకులని అలరించంనుంది 'నక్షత్రం' సినిమాతో ప్రగ్యా జైశ్వాల్.
|