నక్షత్రాలంటే ఆకాశంలోనే మెరుస్తాయి. మరి కృష్ణవంశీ చెప్పినట్లుగా నేల మీద నడిచే నక్షత్రాల సంగతేంటంటారా? నేలమీద నడిచే నక్షత్రం అంటే పోలీస్ అంటూ ఆయన తన సినిమా 'నక్షత్రం'లో ప్రకాష్రాజ్తో పవర్ ఫుల్ డైలాగ్ చెప్పించారు కృష్ణవంశీ. అంటే సినిమా పోలీస్ పవర్ని తెలియజేసే కాన్సెప్ట్తో సరికొత్తగా రూపొందింది అనే విషయం అర్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యింది. ఆడియన్స్ నుండి పోజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది ఈ సినిమా ట్రైలర్. సందీప్ కిషన్, రెజీనా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్, ప్రగ్యా జైశ్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యంగ్ హీరో తనీష్ విలన్గా నటిస్తున్నాడు.
శ్రియ ఐటెం సాంగ్లో మెరిసిపోతోంది. ఇకపోతే కృష్ణవంశీ సెంటిమెంట్ ఆర్టిస్టులు, శివాజీ రాజా, ప్రకాష్ రాజ్ తదితరులు ఉండనే ఉన్నారు. ఇంత మంది ఆర్టిస్టుల్ని ఏమాత్రం క్లమ్జీ లేకుండా, ఏ ఒక్కర్నీ వదిలి పెట్టకుండా ట్రైలర్ని బాగా కట్ చేశాడు కృష్ణవంశీ. అదే కృష్ణవంశీ స్పెషాలిటీ. ప్రతీ క్యారెక్టర్నీ ట్రైలర్లో చూపించాల్సిన అవసరం లేదు. కానీ కృష్ణవంశీ చూపించాడు. దాంతో ఇంకా ఎవరెవరు కనిపిస్తారా? అంటూ ట్రైలర్ ఎండింగ్ వరకూ ఆశక్తిగా ఎదురు చూశారు ఆడియన్స్. మొత్తానికి కృష్ణవంశీ ట్రైలర్తోనే సగం మార్కులు కొట్టేశాడనిపిస్తోంది. తన మార్కు డైరెక్షన్తో కృష్ణవంశీ సినిమాను ఎలా తెరకెక్కించాడో చూడాలంటే మరి కొంత కాలం మాత్రమే ఆగాల్సి ఉంది. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|