సూపర్స్టార్ మహేష్బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రాన్ని చూసిన ప్రతీ ప్రముఖులు ఆ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా చూశారు. ఆయనకు చాలా బాగా నచ్చిందట ఈ సినిమా. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ప్రెస్ మీట్ సన్నివేశం తనని ఎంతగానో ఇన్స్పైర్ చేసిందని చిరంజీవి అన్నారు. ఇప్పటికే ఈ సీన్ చాలామందిని ప్రభావితం చేసింది. ఈ సన్నివేశంలో మహేష్బాబు నటన, డైలాగ్స్ ఎంతో మందికి కనువిప్పు కలిగేలా చేశాయి. అంతేకాదు, ప్రస్తుతం మీడియాపై నెలకొన్న పరిస్థితులకు ఈ సన్నివేశం కనెక్టివ్గా ఉండడంతో ఈ సీన్కి అంత ప్రాముఖ్యత వచ్చిందని అంటున్నారు. అందుకే మెగాస్టార్ చిరంజీవిని కూడా ఈ సీన్ అంతగా ప్రభావితం చేసింది.
సినిమా చూసొచ్చిన చిరంజీవి మహేష్బాబుపై ప్రశంసల జల్లు కురిపించడంతో పాటు, మహేష్తో చిరు కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ప్రస్థావించారు. చరణ్, మహేష్ మంచి స్నేహితులు. అలాగే చరణ్ భార్య ఉపాసన, మహేష్ భార్య నమ్రత కూడా మంచి ఫ్రెండ్స్. రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు. కంబైండ్గా వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూంటారు. అలా మహేష్కి, చిరంజీవి ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. ఇక సినిమా విషయానికి వస్తే, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంచలన విజయం అందుకుంది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఈ సినిమాతో టాలీవుడ్కి పరిచయమైంది.
|