మెగా మేనల్లుడు సాయి ధరమ్తేజ్ తాజా చిత్రం 'చిత్రలహరి' లేటెస్టుగా సెట్స్ మీదికెళ్లింది. 'నేను శైలజ'తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వరుస ఫెయిల్యూర్స్ మీదున్న సాయి ధరమ్తేజ్కి ఈ సినిమా చాలా కీలకం. అలాగే కిషోర్కీ 'నేను శైలజ' తర్వాత సరైన హిట్ లేదు. సో ఈ ఇద్దరూ 'చిత్రలహరి'పై బాగా ఫోకస్ పెట్టారట. ఎలాగైనా ఈ సినిమాతో ఇద్దరూ సూపర్ హిట్ కొట్టాలనే కసి మీదున్నారట. కథల పరంగా వరుసగా 'జవాన్', 'ఇంటెలిజెంట్' తదితర సినిమాలతో తేజు మూస కథలను ఎంచుకుంటున్నాడనే టాక్ వినిపించింది.
దాంతో ఈ సారి కాస్త ఆలోచింది, సన్నిహితుల సలహాలు తీసుకుని 'చిత్రలహరి'కి ఓకే చేశాడట. తాజాగా సెట్స్ మీదికెళ్లిన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్లోనే మంచి అవుట్ పుట్ని రాబడుతోందనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్. ఈ సినిమాలో మెగా మేనల్లుడి సరసన కళ్యాణీ ప్రియదర్శిని, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ఫిజిక్ని పట్టించుకోవడం మానేశాడనీ తేజుపై కామెంట్స్ వచ్చాయి. దాంతో ఈ సినిమా కోసం తేజు బాగా బరువు తగ్గాడట. అలా బరువు తగ్గేందుకు తేజు సర్జరీని ఆశ్రయించాడనే ప్రచారం జరిగింది. అయితే అదేం లేదనీ, సహజ వర్కవుట్స్, డైట్ కంట్రోల్ ద్వారానే బరువు తగ్గాననీ తేజు చెప్పుకొస్తున్నాడు.
|