తెలుగు, తమిళ, హిందీ సినిమా అనే తేడా లేకుండా, ఇప్పుడు బయోపిక్స్ హవా నడుస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖుల బయోపిక్ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నాయి. తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ పేరిట మూడు చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అలాగే తమిళంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత పేరుతో కూడా మూడు బయోపిక్స్ రూపొందుతున్నాయి. అందులో ఒకటి ప్రియదర్శిని దర్శకత్వంలో నిత్యామీనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న బయోపిక్ కాగా, ఇంకోటి భారతీ రాజా దర్శకత్వంలో రూపొందనుంది.
ఈ బయోపిక్లో జయలలిత పాత్ర పోషించేదెవరో తెలీదు కానీ, ఇక ముచ్చటగా మూడో బయోపిక్ని ఏ.ఎన్.విజయ్ తెరకెక్కిస్తున్నారు. ఈ బయోపిక్లో జయలలిత పాత్ర కోసం బాలీవుడ్ భామ విద్యాబాలన్ని ఎంచుకున్నారనీ తాజా సమాచారమ్. ఫిబ్రవరి 24న జయలలిత జయంతి కావడంతో ఆ రోజున ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన వెలువడనుందట. ఈ సినిమాలో ఎమ్జీఆర్ పాత్ర కోసం అరవింద స్వామి పేరు వినిపిస్తోంది. జయలలితపై తెరకెక్కుతోన్న మూడు బయోపిక్స్లోనూ ఈ బయోపిక్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారట. '2.0'ని విజువల్ వండర్గా భారీ బడ్జెట్తో రూపొందించిన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ బయోపిక్ రూపొందనుంది. 2020 ఫిబ్రవరి 24న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా సన్నాహాలు చేస్తున్నారట.
|