రిపబ్లిక్డేని పురస్కరించుకుని ఒక్క రోజు ముందే అంటే జనవరి 25న అక్కినేని అందగాడు అఖిల్ నటిస్తున్న మూడో సినిమా 'మిస్టర్ మజ్ను'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'తొలిప్రేమ' డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. 'సవ్యసాచి' ఫేం నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ సినిమా సక్సెస్పై అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.
లాంఛింగ్ మూవీ, రీ లాంఛింగ్ మూవీ అంటూ 'అఖిల్', 'హలో' చిత్రాలు అఖిల్కి నిరాశనే మిగిల్చాయి. అయితే సక్సెస్ఫుల్ డైరెక్టర్, తొలి సినిమాతోనే యూత్ పల్స్ని బాగా పట్టేసిన డైరెక్టర్ అయిన వెంకీ అట్లూరిని అఖిల్ బాగా నమ్మాడట. దాంతో ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొడతాడనే నమ్మకంతో ఉన్నాడట. అంతేకాకుండా తొలి రెండు సినిమాలకూ ఎక్కువ శాతం యాక్షన్నే నమ్ముకున్నాడు. కానీ ఈ సినిమాతో అఖిల్ ఎంటర్టైన్మెంట్పై కాన్సన్ట్రేషన్ చేశాడట. ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా 'మిస్టర్ మజ్ను' తెరకెక్కుతోంది. అలాగే హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ని విభిన్నంగా చూపించబోతున్నాడట ఈ సినిమాతో డైరెక్టర్. పలువురు సీనియర్ డైరెక్టర్స్ని పరిశీలించి, పక్కన పెట్టేసి నాగార్జున యంగ్ డైరెక్టర్ అయిన వెంకీ అట్లూరికిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడో లేదో చూడాలిక.
|