అక్కినేని అఖిల్ తాజాగా 'మిస్టర్ మజ్ను' సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. తొలి రెండు సినిమాలతో నిరాశపరిచిన అఖిల్ ఈ సారి హిట్ కొట్టేలానే ఉన్నాడు. లేటెస్టుగా ఈ సినిమా టీజర్ని వదిలారు. నిన్న మొన్నటి వరకూ వచ్చిన ఆడియో సింగిల్స్ ప్రోమోస్ ద్వారానే అఖిల్ భళా అనిపించుకున్నాడు. ఇక లేటెస్ట్ టీజర్తో సినిమాపై అంచనాలు పెంచేశాడు. ఇక టీజర్ విషయానికి వస్తే, ఈ తరం యూత్కి కనెక్టివ్గా ఉన్నట్లుంది ఈ 'మిస్టర్ మజ్ను'. అఖిల్ డైలాగ్ డెలివరీ యూత్ని బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. అమ్మాయిల్ని పడగొట్టే చిలిపి కుర్రోడిలా అఖిల్ పాత్రను డిజైన్ చేశాడు డైరెక్టర్.
ఎప్పటిలాగే డాన్సులు ఇరగదీసేశాడు అక్కినేని బుల్లోడు. అలాగే యాక్షన్ కూడా దుమ్ము దులిపేశాడు. తొలి రెండు సినిమాలతో పోల్చితే, అఖిల్లో చాలా ఈజ్ కనిపించింది. 'సవ్యసాచి'తో తెలుగు తెరకు పరిచయమైన నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. టీజర్లో ఈ ముద్దుగుమ్మను అందంగా చూపించారు. జనవరి నెలాఖరున 'మిస్టర్ మజ్ను' ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి సినిమా డిజాస్టర్ కావడంతో, రెండో సినిమాని రీ ఎంట్రీ మూవీగా అభివర్ణించారు అఖిల్కి. అయితే మూడో సినిమాతో అఖిల్ మంచి హిట్ కొట్టి అమ్మాయిల మనసుల్లో 'మజ్ను'గా ముద్ర వేయించుకునేలానే ఉన్నాడనిపిస్తోంది. 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
|