రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ మల్టీ స్టారర్గా తెరకెక్కుతోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. అనౌన్స్మెంట్ డే నుండే అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఇప్పుడు రియల్ టాక్స్లోకి వచ్చేసింది. ఇంతవరకూ ఈ సినిమా స్టోరీ ఇదట. అదట అంటూ జరిగిన ప్రచారాలన్నీ జస్ట్ గాసిప్సేనట. తాజాగా సినిమా కథ గురించి చరణ్ పెదవి విప్పాడు. స్టోరీ వినగానే చరణ్ షాకయ్యాడట. 'రంగస్థలం' తర్వాత చరణ్ని అంతలా షాకయ్యేలా చేసిన స్టోరీ లైన్ ఇదేనట. అంతేకాదు చరణ్కీ, ఎన్టీఆర్కీ ఒకేసారి జక్కన్న కథ వినిపించాడట. కథ వినగానే చరణ్ షాక్లోకి వెళ్లిపోయాట. తేరుకోవడానికి కాస్త టైం పట్టిందట. కథలో విషయాన్ని బట్టే రాజమౌళి ఈ సినిమాకి హీరోలుగా ఎన్టీఆర్నీ, చరణ్నీ ఎంచుకున్నాడట. ఇదో పీరియాడిక్ మూవీ అయ్యుంటుందని అంతా భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాదని చరణ్ మాటల ద్వారా అర్ధమవుతోంది. కానీ అసలు స్టోరీ ఏంటనేది మాత్రం చరణ్ చెప్పలేదు. ఇంతవరకూ ఇలాంటి స్టోరీ అయితే తను వినలేదని మాత్రం చెప్పాడు. ఇంతలా చెబుతున్నాడంటే ఇదేదో విలక్షణ సినిమా అని తెలుస్తోంది.
ఆల్రెడీ సెట్స్పై ఉందీ సినిమా. కొంత షూటింగ్లో చరణ్ కూడా పాల్గొన్నాడు. ఎన్టీఆర్, చరణ్ల కాంబో సీన్స్ చాలా బాగా వస్తున్నాయట. అయితే ప్రస్తుతం చరణ్ 'వీవీఆర్' సినిమా ప్రమోషన్స్ కోసం కాస్త గ్యాప్ తీసుకున్నాడు. అలాగే రాజమౌళి కూడా కుమారుడి వివాహ వేడుకల్లో బిజీగా ఉండడం వల్ల టోటల్గా షూటింగ్కి కాస్త బ్రేక్ ఇచ్చారట. త్వరలోనే నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభించనున్నారు.
|