మెగాస్టార్ 151వ చిత్రంగా తెరకెక్కుతోన్న 'సైరా నరసింహారెడ్డి' రిలీజ్ డేట్పై క్లారిటీ ఇచ్చేశాడు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న మెగా పవర్స్టార్ రామ్చరణ్. మొదట్లో 'సైరా'ని దసరాకి విడుదల చేయాలనుకున్నారు. భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి 2020 సంక్రాంతి సీజన్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ ఏడాదిలోనే 'సైరా' షూటింగ్ పూర్తి చేయనున్నారట. సినిమాని పోస్ట్ సమ్మర్కి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారట. ఈ విషయమై లేటెస్టుగా చరణ్ క్లారిటీ ఇచ్చేశాడు. గతంలో చరణ్ నటించిన 'మగధీర' మూవీ ఇదే సీజన్లో విడుదలై రికార్డులు సృష్టించింది. చిరంజీవి కెరీర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రంగా రూపొందుతోన్న 'సైరా' సినిమాకి అదే సెంటిమెంట్ని ఆపాదించి పోస్ట్ సమ్మర్కి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న పక్కా స్ట్రేటజీతో చరణ్ ఉన్నాడట.
ఇదిలా ఉంటే, 'సైరా' కోసం ఈ వయసులో చిరంజీవి చాలా కష్టపడుతున్నాడనీ, వయసుకు మించి ఆయనకు ఒత్తిడి ఎక్కువవుతోందంటూ గాసిప్స్ బయటికి వచ్చాయి ఈ మధ్య. అయితే అలాంటిదేమీ లేదనీ, 'సైరా' షూటింగ్ని నాన్న చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారనీ, ఆయన ఉత్సాహంతోనే సినిమాని శరవేగంగా పూర్తి చేయగలుగుతున్నామని చరణ్ అన్నాడు. ఈ సినిమా తర్వాత చిరంజీవి కొరటాలతో ఓ సినిమా, త్రివిక్రమ్తో ఇంకో సినిమా చేయనున్నారు.
|