'రంగస్థలం' టైంలో సుకుమార్ చరణ్కి ఓ కథ చెప్పాడట. అయితే ఆ కథలో కొన్ని కీలక మార్పులు చేయమని చరణ్, చిరంజీవి సుకుమార్కి సూచించారట. దాంతో ఆ కథని పక్కన పెట్టేసి, 'రంగస్థలం' స్టోరీని ప్రిపేర్ చేశాడట సుకుమార్. ఆ స్టోరీతోనే 'రంగస్థలం' సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇదిలా ఉంటే, సుకుమార్ ప్రస్తుతం కొత్త మెగా హీరో వైష్ణవ్ తేజ్తో ఓ సినిమా రూపొందిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సుకుమార్ దర్శకుడు కాదు. నిర్మాణ భాగస్వామి మాత్రమే. తనకు అత్యంత సన్నిహితులైన మైత్రీ మూవీస్ బ్యానర్తో కలిసి సుకుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే కథ మాత్రం సుకుమార్దే. కథ విషయంలో తాజాగా అందుతోన్న సమాచారమ్ ప్రకారం 'రంగస్థలం' టైంలో చరణ్కి చెప్పిన కథనే డెవలప్ చేసి ఇప్పుడు వైష్ణవ్ తేజ్తో తెరకెక్కిస్తున్నాడనీ అని ఓ గాసిప్ ప్రచారంలో ఉంది. అయితే సుకుమార్ అలా ఎందుకు చేస్తాడు.?
కేవలం ఫస్ట్లుక్ పోస్టర్లో హీరో గెటప్ చూసి అలా అనుకోవడం సరికాదేమో. సుకుమార్ అంటే క్రియేటివిటీ. క్రియేటివిటీ అంటే సుకుమార్. ఆయన దగ్గర కుప్పలు తెప్పలుగా వినూత్న కథలుంటాయి. అయితే అన్నింటికీ తానే దర్శకత్వం వహించాలంటే కుదరదు కదా. అందుకే తన కథలను ఇలా అప్పిస్తుంటాడు. అలా సుకుమార్ కథలతో ఎన్నో చిన్న సినిమాలు కూడా తెరకెక్కి మంచి పేరు తెచ్చుకున్నాయి. తాజాగా వైష్ణవ్ తేజ్ కోసం సుకుమార్ రాసిన కథ కూడా అలాంటిదే అయ్యుంటుంది. కొత్త సినిమా వస్తుందంటే, ఇలాంటి గాసిప్స్ ప్రచారంలో ఉండడం మామూలే.
|