డబుల్ సెంచరీ అంటే రెండొందలు కాదు, రెండు వేల లక్షలు. అవును అచ్చంగా 20 కోట్లు. 20 కోట్ల వ్యూస్ కొల్లగొట్టి సాయి పల్లవి అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. తన తాజా చిత్రం 'మారి 2'లోని ఓ పాటతో. 'రౌడీ బేబీ..' అనే ఈ సాంగ్కి వచ్చిన హ్యూజ్ రెస్పాన్స్తో సాయి పల్లవి ఈ అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. గతంలో 'ఫిదా' సినిమాలో 'వచ్చిండే..' పాటతో యూ ట్యూబ్ వ్యూస్ పరంగా టాప్ ప్లేస్లో ఉన్న సాయి పల్లవి తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. సాయిపల్లవికి ముందు ఆ రికార్డు తమిళ హీరో ధనుష్ సొంతం. ధనుష్ నటించిన 'త్రీ' సినిమాలోని 'వై దిస్ కొలెవరీ..' సాంగ్ ఓ ఊపు ఊపేసింది. అత్యధిక వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో టాప్ ప్లేస్ దక్కించుకుంది.
ఆ తర్వాత సాయి పల్లవి ఆ రికార్డును కొల్లగొట్టింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మళ్లీ ఆ రికార్డును బ్రేక్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ధనుష్, సాయి పల్లవికి థాంక్స్ చెప్పి, కంగ్రాట్స్ కూడా తెలిపారు. ఈ పాటను రాసింది, పాడింది ధనుష్ కావడం విశేషం. ప్రభుదేవా, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేశారు. ధనుష్తో ధీ గొంతు కలిపింది.
|