Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

డబుల్‌ సెంచరీ కొట్టేసిన సాయిపల్లవి.!

double century

డబుల్‌ సెంచరీ అంటే రెండొందలు కాదు, రెండు వేల లక్షలు. అవును అచ్చంగా 20 కోట్లు. 20 కోట్ల వ్యూస్‌ కొల్లగొట్టి సాయి పల్లవి అరుదైన రికార్డ్‌ సొంతం చేసుకుంది. తన తాజా చిత్రం 'మారి 2'లోని ఓ పాటతో. 'రౌడీ బేబీ..' అనే ఈ సాంగ్‌కి వచ్చిన హ్యూజ్‌ రెస్పాన్స్‌తో సాయి పల్లవి ఈ అరుదైన రికార్డ్‌ సొంతం చేసుకుంది. గతంలో 'ఫిదా' సినిమాలో 'వచ్చిండే..' పాటతో యూ ట్యూబ్‌ వ్యూస్‌ పరంగా టాప్‌ ప్లేస్‌లో ఉన్న సాయి పల్లవి తన రికార్డును తానే బ్రేక్‌ చేసుకుంది. సాయిపల్లవికి ముందు ఆ రికార్డు తమిళ హీరో ధనుష్‌ సొంతం. ధనుష్‌ నటించిన 'త్రీ' సినిమాలోని 'వై దిస్‌ కొలెవరీ..' సాంగ్‌ ఓ ఊపు ఊపేసింది. అత్యధిక వ్యూస్‌ సాధించి సోషల్‌ మీడియాలో టాప్‌ ప్లేస్‌ దక్కించుకుంది.

ఆ తర్వాత సాయి పల్లవి ఆ రికార్డును కొల్లగొట్టింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మళ్లీ ఆ రికార్డును బ్రేక్‌ చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ధనుష్‌, సాయి పల్లవికి థాంక్స్‌ చెప్పి, కంగ్రాట్స్‌ కూడా తెలిపారు. ఈ పాటను రాసింది, పాడింది ధనుష్‌ కావడం విశేషం. ప్రభుదేవా, జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు. యువన్‌ శంకర్‌ రాజా మ్యూజిక్‌ కంపోజ్‌ చేశారు. ధనుష్‌తో ధీ గొంతు కలిపింది. 

మరిన్ని సినిమా కబుర్లు
Is this time sensational