Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
vijayabapineedu is no more

ఈ సంచికలో >> సినిమా >>

తండ్రీ కొడుకుల 'రొమాంటిక్‌' చిత్రం.!

romantic movie

'ఆంధ్రా పోరీ' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు పూరీ జగన్నాధ్‌ తనయుడు ఆకాష్‌ పూరీ. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించాడు ఆకాష్‌ పూరీ. హీరోగా తొలి సినిమాకి పెద్దగా స్కోప్‌ లేదు. తర్వాత భారీ అంచనాల నడుమ తండ్రి పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలోనే 'మెహబూబా' సినిమాలో నటించాడు ఆకాష్‌ పూరీ. కానీ దురదృష్టవశాత్తూ ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. దాంతో ముచ్చటగా మూడో సినిమాకి రంగం సిద్ధం చేశాడు పూరీ జగన్నాధ్‌. అయితే ఈ సారి దర్శకత్వం వహించే బాధ్యతను ఓ కొత్త డైరెక్టర్‌కి అప్పగించాడు. అనిల్‌ పాడూరి ఈ సినిమాకి దర్శకుడు. కానీ స్క్రిప్టుతో పాటు, నిర్మాణం, స్క్రీన్‌ప్లే కూడా పూరీదే. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌లో ఛార్మితో కలిసి పూరీ జగన్నాధ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకి 'రొమాంటిక్‌' అనే యూత్‌ఫుల్‌ టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. 'మెహబూబా'తో నేహశెట్టిని హీరోయిన్‌గా పరిచయం చేసిన పూరీ ఈ సినిమా కోసం ఇంకో కొత్తమ్మాయిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. మరోవైపు పూరీ, యంగ్‌ హీరో రామ్‌తో 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఓ వైపు ఇస్మార్ట్‌ శంకర్‌కి దర్శకత్వం వహిస్తూనే కొడుకుతో 'రొమాంటిక్‌' మూవీ పనులు కూడా చూసుకోనున్నాడట పూరీ. సో పూరీ డబుల్‌ ధమాకా ఈ ఏడాది ఎలాంటి సక్సెస్‌ అందిస్తుందో చూడాలిక.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam