|
రక్షక భటుడు : బుగ్గ మీద చిన్న మొటిమ లేచింది... ఆ మాత్రానికే రాజుగారు విచారపడిపోతున్నారే?
రాజ వైద్యుడు : రాచకురుపు లేవ లేదే అని, అవమానకరంగా వుందని, మధనపడిపోతున్నారు!!
|
|
రాజుగారు : నేను దేశాటనకి వెళ్తున్నాను. తిరిగొచ్చేదాకా, రాజ్యభారం, రాజ్యరక్షణ, రాజ్యపాలన అంతా నీదే!
రాణిగారు : ఐతే నెమ్మదిగా తిరిగి రండి!!! |
|
|
|
భటుడు : చెరసాల - 214 నుంచి, ఖైదీ - 116 తప్పించుకు పారిపోయాడు ప్రభూ!
ప్రభువు : ఆ ఖైదీని చివరిసారిగా కలిసిన వాళ్ళెవరు?
భటుడు : యువరాణీ గారు ప్రభూ!
ప్రభువు : ఐతే యువరాణి గారూ కనిపించటం లేదా?
భటుడు : యువరాణిగారున్నారు! మహారాణి గారు కనిపించడం లేదు ప్రభూ!
|
|
ముసలి రాజు : నువ్వు కవల పిల్లల్ని కన్నావ్! ఆ ఇద్దర్లో ఒకడు దుర్మార్గుడైతే, ఇంకొకడు సన్మార్గుడుగా ఎదగాలిగా?
ముసలి రాణి : ఏం చేయమంటారు... మన దురదృష్టం, ఇద్దరూ దుర్మార్గులయ్యారు! మనం ఈ చెరసాలలో మగ్గుతున్నాం!!
|
|
|
|
మిత్రుడు : మిత్రమా నువ్వు రచించిన వీధి నాటకం, ప్రదర్శనకు సిద్ధముగా నున్నదా?
నాటక రచయిత : అన్నీ సిద్ధముగానే వున్నాయి. వీధి మాత్రం సిద్ధంగా లేదు. ఎక్కడ చూసినా గుంటలు, బురద నీళ్ళు!!
|
|
పెద్ద పూజారి : ఈ రోజు విఘ్నేశ్వరుడికి పాలాభిషేకం జరిగింది కదా? కొంచెం పాలు, ఆ తీర్ధం చెంబులో పోసివ్వు!
చిన్న పూజారి : ఇంకెక్కడి పాలు? వినాయకుడు చుక్క మిగల్చకుండా తాగేశాడు గా!!
|
|
|
|
తపస్వి : స్వామీ... పిలచిన తడవుగానే వచ్చేశావు! ముందుగా రంభ, మేనక, తిలోత్తమలని పంపిస్తా ననుకున్నానే?
బ్రహ్మ దేవుడు : నువ్వొట్టి బుద్ధావతారమని తెలిసి, వాళ్ళని వేరే చోట్లకి పంపించి, నీకు ప్రత్యక్షమయ్యాను నాయనా!!
|
|
వైద్య శిరోమణి : ఈ లేహ్యంలో పదహారు వనమూలికలు, ఇరవై రెండు శక్తివంతమైన లవణాలూ వున్నాయి. ఇది సర్వరోగ నివారిణి. ఐతే దీన్ని చిక్కటి గవుడు గేదె పాలు తోనే సేవించాలి!!
ముసుగు మనిషి : (ముసుగు తొలగించి), పాలుతో గాక నీటితో సేవించానయ్యా, ఇలా ఐపోయాను!!
వైద్య శిరోమణి : ఎవర్రా అక్కడ? ఈ అస్థిపంజరాన్ని స్మశానంలో పడవేసిరా పో.
|
|
|
|
ఒకడు : నీకు రాజుగారి ప్రధాన అంతఃపురంలో ఉద్యోగం దొరికిందటగా? ఏం ఉద్యోగం?
ఇంకొకడు : "ఎవర్రా అక్కడ" ఉద్యోగం!!
|
|
భటుడు : సేనాధిపతి గారూ, కోట తలుపులు బిగుసుకు పోయాయి!
సేనాధిపతి : పాతిక మంది చేత ఒక దుంగను మోసుకెళ్ళి తలుపులుకి గుద్ధించండి!!
భటుడు : గుద్ధించాం... తలుపులు తెరుచుకోలే... కోట గోడకి పెద్ద చిల్లు పడింది!!!
|
|