కావలసిన పదార్థాలు:
రొయ్యలు, ఉల్లిపాయముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్
తయారు చేయు విధానం:
ముందుగా నూనె వేడి చేసుకొని దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం వేసి బాగా మగ్గలివ్వాలి. బాగా మగ్గిన తరువాత దానిలో రొయ్యలు వేసి బాగా కలిపి మూతపెట్టాలి. కొంచెం బాగా ఉడికిన తరువాత దానిలో గరం మసాలా పౌడర్ వేయాలి. నీరు మొత్తం ఆవిరై పోయిన తరువాత దించితే గుమగుమలాడే రొయ్యల వేపుడు రెడీ.
|