బాలీవుడ్లో ఒకటీ అరా సినిమాలు చేసినా అంతగా పేరు దక్కించుకోలేని కైరా అద్వానీ, తెలుగులో నటించిన 'భరత్ అనే నేను' సినిమాతో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. అయితే 'వినయ విధేయ రామ' దెబ్బకి మళ్లీ బాలీవుడ్కి చెక్కేసింది. అక్కడ ప్రస్తుతం కైరా ఫుల్ బిజీగా గడుపుతోంది. త్వరలో 'కబీర్సింగ్'తో రానుంది. 'కబీర్సింగ్'లో కైరా హీరోయిన్ అట అన్నప్పుడే ఆ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఆ తర్వాత వరుస ఆఫర్లు కైరా తలుపు తట్టాయి.
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్తో వరుసగా రెండు సినిమాల్లో నటిస్తోంది కైరా అద్వానీ. రెండూ ప్రతిష్ఠాత్మక చిత్రాలే. లేటెస్ట్గా యంగ్ హీరో సిద్దార్ధ్ మల్హోత్రాతో ఓ సినిమా లాంఛనంగా స్టార్ట్ అయ్యింది. హీరోయిన్గా ఇంత బిజీగా ఉంటూనే, మరోవైపు స్పెషల్ సాంగ్స్ని కూడా వదిలి పెట్టడం లేదు. పీరియాడిక్ మూవీగా తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ 'కళంక్'లో స్పెషల్ సాంగ్లో మెరిసింది కైరా అద్వానీ. సినిమాకే హైలైట్గా నిలిచిన ఈ సాంగ్లో కైరా అందాలు ఫ్యాన్స్ని ఉర్రూతలూగించాయి. ఇవన్నీ ఇలా ఉంటే, అసలే హీరోయిన్స్ కొరత ఉన్న టాలీవుడ్కి కైరా అద్వానీ రూపంలో ఓ మంచి హీరోయిన్ దొరికిందనుకుంటే, ఆ అవకాశం కాస్తా ఇలా చేజారిపోయింది. పరిస్థితి చూస్తుంటే, ఇప్పుడప్పుడే కైరా అద్వానీ బాలీవుడ్ని వదిలి టాలీవుడ్కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
|