ఇదిగో అదిగో అంటూ ఎప్పటి నుండో టాక్ వినిపిస్తున్న 'భీష్మ' సినిమా ఎట్టకేలకు లాంఛ్ అయ్యింది. నితిన్ హీరోగా, రష్మికా మండన్నా హీరోయిన్గా తెరకెక్కుతోన్న సినిమా ఇది. సినిమా అయితే లాంఛ్ అయ్యింది కానీనండీ.. ఈ సినిమాలో రష్మికా హీరోయిన్గా కొనసాగుతుందా.? అంటే ఛాన్సే లేదు అనే రూమర్స్ మొదలయ్యాయ్. ఎప్పటి నుండో అనుకుంటున్న సినిమా ఇది. అప్పటికి రష్మికా చేతిలో పెద్దగా ప్రాజెక్టులు లేవు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రష్మికా మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ అయిపోయింది. స్టార్ హీరోల సరసన వరుస ఛాన్సులు దక్కించుకుంటోంది. మహేష్బాబుతో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో రష్మికా హీరోయిన్ అన్న సంగతి తెలిసే ఉంటుంది. అలాగే అల్లు అర్జున్ - సుకుమార్ కాంబో మూవీలోనూ అమ్మడే హీరోయిన్. వీటితో పాటు, తమిళంలో కార్తితో ఓ సినిమా చేస్తోంది..
మరిన్ని ప్రాజెక్టుల్ని ఓకే చేసే దిశగా చర్చలు జరుపుతోంది. సో ఇన్ని కమిట్మెంట్స్ ఉన్న కారణంగా ఈ క్రేజీ బ్యూటీ 'భీష్మ'ను స్కిప్ చేసేస్తుందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే, 'భీష్మ'ని వదిలే ప్రశక్తి లేదంటోంది రష్మికా. ఈ కథ చాలా బాగా నచ్చేసిందట రష్మికాకి. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నో బిగ్ ఆఫర్స్ని కూడా వదిలేసుకుందట. సో ఇబ్బడి ముబ్బడిగా సర్క్యులేట్ అవుతోన్న రూమర్స్ అన్నీ పచ్చి అబద్ధాలే అంటూ రష్మికా కొట్టి పారేస్తోందట. ఏది ఏమైతేనేం ఎప్పటి నుండో అనుకుంటున్న ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కినందుకు రష్మికా ఫుల్ల్ హ్యాపీగా ఉందట. జూన్ 20 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. జూలై 26న రష్మికా 'డియర్ కామ్రేడ్'తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
|