ఒకేరోజు రెండు టీజర్లు వచ్చాయి. ప్రబాస్తో నాగార్జునకు పోటీ ఏంటని చాలా మంది అనుకున్నారు. టైం అలా ఇద్దరికీ సెట్టయ్యింది. కొద్ది నిమిషాల వ్యవధిలో ఈ రెండు టీజర్లు బయటికొచ్చాయి. యాక్షన్ థ్రిల్లర్గా 'సాహో' టీజర్ వస్తే, రొమాంటిక్ ఎంటర్టైనర్గా 'మన్మధుడు 2' టీజర్ వచ్చింది. రెండింటినీ ఒకదాని తర్వాత ఒకటి చూస్తే, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్ చూసేసిన భావన చాలా మందికి కలిగింది. దాన్నీ దీన్నీ మిక్స్ చేయడమేంటీ.? అంటే 'సాహో'లో ఎంటర్టైన్మెంట్ లేదు. రొమాన్స్ లేదు. అలా 'మన్మధుడు' వాటిని కవర్ చేశాడు. 'మన్మధుడు'లో యాక్షన్ లేదు. అన్నీ ఉంటే, కమర్షియల్ ఎంటర్టైనర్ అంటాం కదా. అలా రెండూ కలిపి పండగ చేసుకున్నారు సగటు సినీ అభిమానులు. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఆటు 'సాహో'నీ, ఇటు 'మన్మధుడు'ని ఓ రేంజ్లో అభినందించేశారు. మామూలుగా అయితే, ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగిపోతాయ్.
కానీ, ఇక్కడ ఒకర్నొకరు అభినందించుకున్నారు. ఇదీ సినీ పరిశ్రమకు కావల్సింది. టాలీవుడ్లో నాగార్జున అంటే అజాతశత్రువు. ప్రబాస్ అందరికీ డార్లింగ్. అదీ అసలు సంగతి. 'సాహో'రే అనేశారు 'మన్మధుడి' అభిమానులు. మన్మధుడి రొమాన్స్ చూసి ఫిదా అయ్యారు ప్రబాస్ అభిమానులు. అదిరింది కదూ ఈ ఈక్వేషన్.
|