దాదాపు 13 ఏళ్ల తర్వాత ముఖానికి రంగేసుకుంటోంది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. సూపర్ స్టార్ మహేష్బాబు తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరూ..'తో విజయ శాంతి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్గా ఆమె సెట్స్లోకి అడుగు పెట్టారు. వస్తూ వస్తూనే ఆమె ఆటిట్యూడ్ చూపించేశారు. ఆమె రీ ఎంట్రీకి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ, డైరెక్టర్ అనిల్ రావిపూడి లాంగ్ బ్యాక్ తర్వాత కూడా ఆమెలో అదే ఆటిట్యూడ్ కనిపిస్తోంది.. అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అందుకు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. 'క్లైమాట్ మారిపోయినట్లు నా ఆటిట్యూడ్ మారిపోదు..' అంటూ విజయశాంతి అప్పుడే అనిల్ రావిపూడికి ఆటిట్యూడ్ చూపించేసింది. ఇదిలా ఉంటే, ఇటీవలే కశ్మీర్లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని, ప్రస్తుతం హైద్రాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం.
విజయశాంతి ఎంట్రీతో సెట్స్లో ఆహ్లాదమైన వాతావరణం ఉంటోందట. ఆమె యాక్టింగ్లోని ఈజ్ చూసి డైరెక్టర్ అనిల్ రావిపూడి సహా మిగిలిన చిత్ర యూనిట్ ఆశ్చర్యపోతున్నారట. దటీజ్ లేడీ సూపర్ స్టార్. దిల్రాజు, మహేష్బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
|