'రౌడీ'గా యూత్ మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరో విజయ్ దేవరకొండ ఇటీవల 'డియర్ కామ్రేడ్'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైంది. కానీ, ఫ్యాన్స్ని భారీగా నిరాశపరిచింది. ఈ సంగతి అటుంచితే, తాజాగా మన రౌడీ, ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీతో చేతులు కలిపాడు. గత కొంత కాలంగా ఈ కాంబినేషన్పై జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ, అదంతా ఉత్తదేనంటూ కొట్టి పాడేశారు. కానీ ఎట్టకేలకు ఈ కాంబినేషన్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఎట్టకేలకు రౌడీ స్టార్, పూరీ జగన్నాధ్కి కనెక్ట్ అయ్యాడు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. అయితే, ఇందుకు కొంత సమయం పట్టనుందట. ఎట్ ఏ టైమ్ పూరీ జగన్నాధ్ ఇటు 'ఇస్మార్ట్ శంకర్' సినిమానీ, అటు కొడుకుతో 'రొమాంటిక్' మూవీని స్టార్ట్ చేశాడు.
అయితే, తన డైరెక్షన్లోని 'ఇస్మార్ట్ శంకర్' నిర్మాణం పూర్తి చేసుకుని, ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టేసింది. ఇక కొడుకు సినిమా 'రొమాంటిక్'పై ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయనున్నాడట. ఈ సినిమాకి పూరీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కథ, స్క్రీన్ప్లే అందిస్తున్నాడు కానీ, డైరెక్షన్ మాత్రం చేయడం లేదు. సో త్వరలో ఈ సినిమా పూర్తి చేసి, రౌడీ సినిమా గురించి ఆలోచించనున్నాడట. ఈలోగా విజయ్ దేవరకొండ కూడా అంతకు ముందే కమిట్ అయిన క్రాంతి మాధవ్ సినిమా, 'హీరో' తదితర ప్రాజెక్టులు కంప్లీట్ చేయనున్నాడట. అదీ సంగతి.
|