అక్కినేని అందగాడికి ఎట్టకేలకు జోడీ కుదిరింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్దేని ఎంపిక చేశారు. ఇటీవలే ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తూ, చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. త్వరలోనే పూజా హెగ్దే షూటింగ్లో జాయిన్ కానుంది. పూజా క్యారెక్టర్ని డిఫరెంట్గా డిజైన్ చేశాడట డైరెక్టర్. 'బొమ్మరిల్లు' సినిమాకి హీరోయిన్ జెనీలియా స్పెషల్ అట్రాక్షన్. బబ్లీ గాళ్గా జెనీలియాని చాలా చక్కగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు భాస్కర్. యూత్కి ఆ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయ్యింది. అలాగే ఇప్పుడు పూజా క్యారెక్టర్ని కూడా చాలా కొత్తగా డిజైన్ చేశాడట. ఇంతవరకూ పూజా అలాంటి పాత్రలో నటించింది లేదట. ఇక అఖిల్ విషయానికొస్తే, అఖిల్ కెరీర్లో నాలుగో సినిమా ఇది.
ఇంతవరకూ అఖిల్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్లందరూ ఆషా మాషీ డైరెక్టర్లు కాదు. కానీ, ఎందుకో అఖిల్కి హిట్ ఇవ్వడంలో వారు ఫెయిల్ అయ్యారు. కానీ, ఈ సినిమాలో భాస్కర్ అఖిల్ని ఫుల్ ఎనర్జిటిక్గా చూపించబోతున్నాడట. అఖిల్లోని లోపాలన్నీ ఈ సినిమాతో పూర్తిగా రికవర్ అయిపోతాయని అంటున్నారు. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అవుట్ పుట్ చాలా బాగా వస్తోందట. ఇక తాజాగా హీరో, హీరోయిన్ మధ్య సాగే లవ్ ట్రాక్ సన్నివేశాల చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. తొలిసారి పూజా హెగ్దే , అఖిల్ జోడీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సినిమా ఇది. గీతా ఆర్ట్స్ బ్యానర్తో కలిసి బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|