మాస్ మసాలా డైరెక్టర్ సంపత్ నందితో హ్యాండ్సమ్ హీరో గోపీచంద్ ఇంకోసారి ఫిక్స్ అయ్యాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై గోపీచంద్ హీరోగా సంపత్ నంది ఓ చిత్రం తెరకెక్కించబోతున్నారు. వెర్సటైల్ డైరెక్టర్ సంపత్ నందితో మరోసారి కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని హీరో గోపీచంద్ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గోపీచంద్ 'చాణక్య' సినిమాలో నటిస్తున్నారు. తిరు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది.
బాలీవుడ్ బ్యూటీ జహీర్ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన 'గౌతమ్ నందా' చిత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేదు. కానీ, సంపత్ టేకింగ్కి గోపీచంద్ ఫిదా అయిపోయాడట. నిజమే ఆ సినిమాలో సంపత్ నంది టేకింగ్ కళ్లు చెదరగొట్టేస్తుంది. ఉన్న వనరులతోనే, సినిమాని రిచ్గా మలచడంలో సంపత్ నందిది అందె వేసిన చేయి. హీరోయిన్స్ని అందంగా చూపించడంలోనూ ఆయన డిఫరెంట్ పనితనం చూపిస్తాడు. ఆ టేకింగ్ నచ్చి సంపత్నంది ఆఫర్ని కాదనలేకపోయాడట గోపీచంద్. 'చాణక్య' సినిమా పూర్తి కాగానే సంపత్ నంది సినిమా పట్టాలెక్కనుంది. హీరోయిన్ తదితర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
|