హీరో, దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్, ఒకరిద్దరు సీనియర్ నటీనటులు కాక, ఇతర నటీనటులు.. ఇలా అంతా కొత్తవాళ్లే. కొత్త కాన్సెప్ట్. యూత్కి కనెక్ట్ అయ్యే టైటిల్ నేమ్.. ఇంతకీ ఏ సినిమా గురించి మాట్లాడుకుంటున్నామంటారా.? 'మత్తు వదలరా' అనే ఓ కొత్త మూవీ. రితేష్ రానా అనే యంగ్స్టర్ ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నాడు. హీరో విషయానికి వస్తే, పేరు శ్రీ సింహా. ప్రముఖ మ్యూజిక్ దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు. కీరవాణి పెద్ద కొడుకు కాల భైరవ కూడా ఈ సినిమాతోనే పరిచయమవుతున్నాడు. అయితే, మ్యూజిక్ కేటగిరిలో ఎంట్రీ ఇస్తున్నాడు.
ఇటీవలే ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశాడు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రస్తుతం చిత్ర యూనిట్ బిజీగా గడుపుతోంది. నరేష్ అగస్థ్య అనే మరో యంగ్స్టర్ నటుడిగా ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ఇకపోతే ఈ సినిమాని క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్తో కలిసి, మైత్రీ మూవీస్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది. చూడాలి మరి, తమ తమ టాలెంట్స్తో కీరవాణి వారసులు ఆడియన్స్ని ఎలా మెప్పించనున్నారో.
|