ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్పై ఈ మధ్య ఓ రూమర్ స్వైర విహారం చేసింది. అమలా పాల్ నటించిన 'ఆమె' సినిమా (తమిళంలో ఆడై)ని హిందీలో కంగనా రనౌత్ హీరోయిన్గా రీమేక్ చేయనున్నారట.. అనే గాలి వార్త అది. కొన్ని గాలి వార్తలు చాలా ఎఫెక్టివ్గా చెవులకు ఇంపుగా వినిపిస్తుంటాయి కదా. అలా, 'ఆమె' సినిమాలో కంగనా అట.. అనగానే, వావ్! సూపర్.. కంగనా అయితే, చాలా బావుంటుంది అంటూ ఫ్యాన్స్ తెగ మెచ్చేసుకున్నారు. ఈ సినిమాలో అమలాపాల్ నగ్నంగా నటించిన సీన్ ఒకటి ఈ సినిమా విడుదల సమయంలో ఎంత వివాదాస్పదమైందో తెలిసిందే. వివాదంతో పాటు, సంచలనమైంది కూడా అనాలి.
సో అలాంటి కాన్సెప్ట్ కంగనా చేతిలో పడితే, ఇక దున్నేయదూ.. అనుకున్నారంతా. కానీ, ఈలోగానే ఈ ప్రచారానికి చెక్ పడింది. కంగనా నుండి ఈ రీమేక్ విషయమై క్లారిటీ వచ్చేసింది. తాను ఈ సినిమాలో నటించడం లేదంటూ తన టీమ్ నుండి సమాచారం అందించింది కంగనా రనౌత్. అంతే కాదు, తన చేతిలో ప్రస్తుతం జయ లలిత బయోపిక్ తప్ప మరో ప్రాజెక్ట్ కూడా లేదని తేలిపోయింది. అయితే, కంగనా ప్రస్తుతం జయలలిత బయోపిక్ 'తలైవి'లో నటిస్తూనే, మరోవైపు నిర్మాతగా మారే ఆలోచన కూడా చేస్తోందట. నిర్మాతగా మారి, సొంత బ్యానర్లో అభిరుచి గల సినిమాల్ని రూపొందించాలనుకుంటోందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఏమో కంగనాని తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఓ పక్క హీరోయిన్గా నటిస్తూనే, నిర్మాణ రంగాన్ని కూడా మేనేజ్ చేయగల సత్తా ఉంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ భామలు నిర్మాణంలో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే.
|