తారక్, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం నుండి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. రామ్చరణ్కి జోడీగా అలియా భట్ దొరికింది కానీ, ఎన్టీఆర్కి జోడీ కుదరలేదు ఇంతవరకూ. ఎన్టీఆర్ హీరోయిన్ లేకుండానే దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది 'ఆర్ఆర్ఆర్' చిత్రం. మొదటిగా అనుకున్న విదేశీ భామ డైసీ ఎడ్గర్ జోన్స్ హ్యాండివ్వడంతో, ఆ ప్లేస్ని రీ ప్లేస్ చేసే విదేశీ భామ వేట కొనసాగుతూనే ఉంది. ఎట్టకేలకు ఆ విదేశీ భామ జక్కన్న చేతికి చిక్కింది. ఒలీవియా మోరిస్ అనే హాలీవుడ్ భామ పేరును తారక్కి జోడీగా తాజాగా జక్కన్న ప్రకటించాడు. ఈమెతో పాటు, మరో రెండు ఇంపార్టెంట్ పాత్రలను కూడా రివీల్ చేసింది 'ఆర్ఆర్ఆర్' టీమ్. ఎలిసన్ డూడీ అనే లేడీ క్యారెక్టర్నీ, రే స్టీవెన్సన్ అనే జెంట్ క్యారెక్టర్నీ పరిచయం చేస్తూ వారి ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. ఈ ఇద్దరూ హాలీవుడ్ నటీనటులే. భారీ బడ్జెట్తో పీరియాడికల్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఈ ఇద్దరూ మెయిన్ విలన్స్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎలాంటి సందర్భం లేకుండా, సడెన్గానే అయినా, 'ఆర్ఆర్ఆర్' నుండి అప్డేట్ వచ్చినందుకు ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. ఇకపోతే, వీరితో పాటు, ఈ సినిమాలో బాలీవుడ్ నుండి అజయ్ దేవగణ్, కోలీవుడ్ నుండి సముద్ర ఖని వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జూలై 30న 'ఆర్ఆర్ఆర్' ప్రేక్షకుల ముందుకు రానుందని మొదట్లోనే రాజమౌళి ప్రకటించేశాడు. ఆ డేట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకుండా ఓ యజ్ఞంలా ఈ సినిమాని పూర్తి చేస్తున్నాడు రాజమౌళి.
|