'అర్జున్రెడ్డి' సినిమాతో సెన్సేషనల్ అయిన ముద్దుగుమ్మ షాలినీ పాండే. తొలి సినిమాకే బోల్డ్ సీన్స్లో ఎలాంటి బెరుకూ, భయం లేకుండా యాక్ట్ చేసి, అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత అవకాశాలు కూడా బాగానే అందుకుంటోంది. నందమూరి హీరో కళ్యాణ్రామ్తో '118' సినిమాలో నటించి ఈ ఏడాది మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంతకు ముందే 'మహానటి' తదితర సినిమాల్లో గెస్ట్ రోల్స్ పోషించింది. పర్ఫామెన్స్ పరంగా పాపలో మంచి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని అంతే త్వరగా బాలీవుడ్ కూడా గుర్తించినట్లుంది. ఆహ్వానం పంపింది.
రణ్వీర్ సింగ్ హీరోగా యష్ రాజ్ ఫిలింస్ సంస్థలో నిర్మితమవుతున్న ఓ సినిమాలో షాలినీ పాండేని హీరోయిన్గా ఎంచుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దాంతో షాలినీ పాండే ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్. మరోవైపు తెలుగు, తమిళ భాషల్లో షాలినీ పాండే వరుస ఆఫర్లతో దూసుకెళుతోంది. తెలుగులో ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతోన్న 'ఇద్దరిదీ ఒకటే లోకం' సినిమాలో షాలినీ నటిస్తోంది. అలాగే అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతోన్న 'నిశ్శబ్ధం' సినిమాలో షాలినీ కీలక పాత్ర పోషిస్తోంది. బహుభాషా చిత్రంగా ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
|