మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న 'ప్రతిరోజూ పండగే' సినిమా విడుదలకు దగ్గరయిన సంగతి తెలిసిందే. ఈ నెల 20న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్కి సిద్ధంగా ఉంది. ప్రచార చిత్రాలు చూస్తే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఆహ్లాదకరమైన పల్లెటూరి వాతావరణంలో సినిమాని తెరకెక్కించారు. హోమ్లీ లొకేషన్స్తో అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించేలా ఉంది 'ప్రతిరోజూ పండగే'. రాశీఖన్నా హీరోయిన్గా నటించగా, సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అంతా బాగానే ఉంది కానీ, విడుదల తేదీ దగ్గర పడుతున్నా ఎందుకో ప్రమోషన్స్లో తేజు చాలా వీక్గా కనిపిస్తున్నాడు. ఇదే రోజు తేజుకి పోటీగా నందమూరి నటసింహం బాలయ్య 'రూలర్' అంటూ పవర్ఫుల్గా వచ్చేస్తున్నారు.
బాలయ్య సినిమాకి అసలే మాస్లో బోలెడంత క్రేజ్ ఉంటుంది. అందుకు ఏమాత్రం తగ్గకుండా, ఏదో ఒకటి చేస్తూ, నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు బాలయ్య. కానీ, తేజూ ఎక్కడా సోదిలో లేడు. దాంతో, మెగా ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అవుతున్నారు. సమయం లేదు మిత్రమా అంటూ, 'రూలర్' తొందర పడుతుంటే, తొందరెందుకు బాబాయ్ పండగలా దిగి వస్తాను.. అంటూ తేజు గమ్మునున్నాడు. మరి తేజు స్ట్రాటజీ ఏంటో కానీ, ఈ లోగా ఫ్యాన్స్ మాత్రం ప్రెజర్ తట్టుకోలేకపోతున్నారు.
|