'ఉయ్యాలా జంపాలా' సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన కోనసీమ కుర్రోడు రాజ్ తరుణ్. 'చాల్ చాల్లే ఏవేవో అనుకుంటాం.. అవన్నీ జరుగుతాయా.. ఏంటీ.?' అని అదేదో సినిమాలో బాలయ్య చెప్పినట్లుగా మనోడు డైరెక్టర్ అవ్వాలనుకుని వచ్చి యాక్టర్గా సెటిలైపోయాడు. బోణీ బాగుంది. వరుస అవకాశాలు, వరుస విజయాలు. డబుల్ హ్యాట్రిక్ హీరో అనిపించుకుని, కెరీర్లో స్టాండర్ట్ అయిపోయాడనుకున్న తరుణంలో దురదృష్టం వెంటాడింది. ఫ్లాపులు వెంటాడాయి. అంతే కెరీర్ స్లో అయిపోయింది. ఎక్కడికో వెళ్లాల్సినోడు, వెనకే ఉండిపోయాడు. కోటి ఆశలతో ఇప్పుడు 'ఇద్దరిదీ ఒకటే లోకం' అంటూ వస్తున్నాడు. డిశంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే రోజు ఈ సినిమా విడుదల కావాలని మనోడు పట్టు పట్టాడు.
ఎందుకంటే, తన డెబ్యూ మూవీ ఇదే డేట్కి రిలీజ్ అయ్యి, సంచలన విజయం సాధించింది. సో అదే సెంటిమెంట్ని ఈ సినిమాకి ఆపాదించుకుంటున్నాడు. ఎలాగైనా ఈ సినిమాతో బౌన్స్బ్యాక్ అవ్వాలనుకుంటున్నాడు. మరి మనోడి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా.? చూడాలి మరి. ఈ సినిమాలో రాజ్తరుణ్కి జోడీగా షాలినీ పాండే నటిస్తోంది. క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రానికి జి.ఆర్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
|