'బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్తో కలిసి 'పింక్' రీమేక్ రూపొందించాలని నిర్మాత దిల్ రాజు గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని తిరిగి సినిమాల్లోకి తీసుకురావాలన్నది దిల్ రాజు యోచన. అందుకోసం పవన్ కళ్యాణ్కి ఏకంగా 50 కోట్లు రెమ్యునరేషన్ ఆఫర్ చేశాడు కూడా. దిల్ రాజు కోరుకునేది కేవలం 21 రోజుల డేట్స్ మాత్రమే. ఎలాగైనా పవన్ కళ్యాణ్తోనే ఈ సినిమాని రీమేక్ చేయాలని దిల్ రాజు కంకణం కట్టుకున్నాడు. అయితే, పవన్ కళ్యాణ్ నుండి మాత్రం ఉలుకూ పలుకూ లేదు. ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయ్యి షూటింగ్ కూడా జరుగుతోందనే ప్రచారం జరుగుతోంది. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా ఈ విషయంపై స్పందించలేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగమ్మాయ్ అంజలి, మలయాళ కుట్టీ నివేదా థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పాత్ర మాదిరిగానే లీడ్ ఫీమేల్ రోల్ పోషించేదెవరో కూడా సస్పెన్స్గానే ఉంది. ఆ పాత్ర కోసం మొదట్లో పూజా హెగ్దే పేరు వినిపించినా, తర్వాత ఆ ప్లేస్లో సమంత, తాప్సీ పేర్లు వినిపిస్తున్నాయి. హిందీ రీమేక్లో తాప్సీ నటించింది. మరి తెలుగులో కూడా తాప్సీనే ఆ ఛాన్స్ దక్కించుకుంటుందా.? లేక విలక్షణ చిత్రాలతో దూసుకెళుతోన్న అక్కినేని కోడలు సమంత ఆ ఆఫర్ని ఎగరేసుకెళుతుందా.? చూడాలిక.
|