‘స్వామిరారా’ సినిమాతో విభిన్నతను చాటుకున్న దర్శకుడు సుధీర్ వర్మ, హీరో అక్కినేని నాగచైతన్యతో తీస్తున్న సినిమా ‘దోచెయ్’. సినిమా టైటిల్ డిఫరెంట్గా ఉండటంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. టైటిల్ ఏం పెట్టాలి? ఏది పెడితే క్యాచీగా ఉంటుంది? అని అన్ని కోణాల్లోనూ ఆలోచించి సినిమా కథకు యాప్ట్ అని భావించి ‘దోచెయ్’ అనే టైటిల్ పెట్టారట.
మహేష్తో ‘1 నేనొక్కడినే’ సినిమాలో హీరోయిన్గా నటించిన ముంబై ముద్దుగుమ్మ కృతి సనన్, నాగచైతన్య సరసన ‘దోచెయ్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ‘అత్తారింటికి దారేది’ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. రెండు పాటలు మినహా సినిమా పూర్తయ్యిందనీ, ఇప్పటిదాకా చేసిన సినిమా ఎక్స్ట్రార్డినరీగా వచ్చిందని దర్శకుడు, నిర్మాత తెలిపారు.
సన్నీ ఎం.ఆర్. సంగీతం అందిస్తున్న ఈ ‘దోచెయ్’ చిత్రాన్ని రిలయన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై నిర్మిస్తున్నారు. నాగచైతన్య కెరీర్లో ఈ సినిమా పెద్ద హిట్గా నిలుస్తుందని నిర్మాత కాన్ఫిడెంట్గా చెప్పారు. మార్చ్ ఆఖరి వారంలో ‘దోచెయ్’ సినిమాని విడుదల చేస్తారట.
|