పనసపొట్టు కూర - -పి.పద్మావతి

కావలిసిన పదార్ధాలు: 

పనసపొట్టు, ఉప్పు, చింతపండు, పసుపు, పోపుదినిసులు, ఎండుమిర్చి, కరివేపాకు, నూనె, ఆవాలు

తయారుచేసేవిధానం: ముందుగా పనసపొట్టును ఒక గిన్నెలో వేసి ఉప్పు, చింతపండు రసాన్ని పోసి 20 నిముషాలు ఉడికించాలి. తరువాత వేరుగా బాణలిలో నూనె వేసి పోపుదినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి తరువాత ఉడికించిన పనసపొట్టును వేసి బాగా కలపాలి. తరువాత ఆవాలను ముద్దగా నూరుకుని ఆ ఆవాల ముద్దను ఇందులోవేసి బాగాకలపాలి. అంతే ఆవపెట్టిన పనసపొట్టు కూర రెడీ..