సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

siirasri question

1. ఏ రంగం లో అయినా అభివృద్ధి  కావాలంటే పోటీ వాతావరణం వుండాల్సిందే..! పోటీ వున్నప్పుడు నెగ్గాలనే పంతం సహజం. ఆ పంతం లోంచి వచ్చే వాటిల్లో ఒత్తిడి కూడా ఒకటి. ఈ సూత్రం చదువులకి కూడా వర్తిస్తుంది. ఎవరో ఒకరిద్దరు ఎక్కడో ఒక చోట ఒత్తిడి భరించలేక ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని మొత్తం విద్యా వ్యవస్థలోనే మార్పు రావాలని కోరుకోవడం సమంజసం కాకపోవచ్చు. 
 

2. ఎంత గొప్ప అభివృద్ధి అయినా చదువులైనా ప్రాణాలకంటే ఎక్కువ కాదు. పోటీ వుండొచ్చు కాని మరీ పసిప్రాణాలు తట్టుకోలేనంత భారాలను, టార్గెట్లను వారి మీద మోపడం మంచిది కాదు.  ఎక్కడో ఒకచోటైనా ఎవరో ఒకరిద్దరే అయినా నేలరాలే విద్యాకుసుమాల తల్లిదండ్రుల గర్భశోకం ఎవరూ తీర్చలేనిది. లోటు పూడ్చ లేనిది. ఒత్తిడి లేని చదువులో కూడా అభివృద్ధి వుంటుంది. కనుక కచ్చితంగా బోధనా పద్ధతుల్లోనూ ,  విధ్యావ్యవస్థ లోనూ మార్పు వచ్చి తీరాల్సిందే..!     

 

పై రెండిట్లో ఏది కరెక్ట్ ? 

మరిన్ని వ్యాసాలు

Akashayanam lo anagarikatha
ఆకాశయానంలో అనాగరికత (వ్యాసం)
- మద్దూరి నరసింహమూర్తి
అమ్మ పాదాల వద్ద స్వర్గం ఉంది.
అమ్మ పాదాల వద్ద స్వర్గం ఉంది.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana Kathalu - prathubhaku Pattam
కాశీ ప్రయాణ కథలు - ప్రతిభకు పట్టం
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana kathalu - Pratyupakaram
కాశీ ప్రయాణ కథలు - ప్రత్యూ పకారం
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
దాసరి నారాయణ రావు
దాసరి నారాయణ రావు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు