హీరో అఖిల్ దసరా రేసు నుంచి తప్పుకున్నాడు. అధికారికంగా చిత్ర నిర్మాత నితిన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ట్విట్టర్ ద్వారా అభిమానులకు 'సారీ' చెప్పిన నితిన్, సాంకేతిక కారణాలతోనే సినిమా విడుదల వాయిదా పడినట్లు చెప్పాడు. గ్రాఫిక్స్ ప్రధానంగా వస్తున్న చిత్రాలు అనుకున్న సమయానికి రిలీజ్ కాలేకపోవడం రొటీన్గా మారింది. ఎంత ప్లానింగ్తో ఉన్నా, ఔట్ పుట్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని సమస్యలొస్తున్నాయి. దాంతో, సినిమా రిలీజ్ ఇబ్బందికరంగా మారుతుంది. తొలి సినిమా కావడంతో ఎక్కడా రాజీపడకూడదని అఖిల్,
నాగార్జున తీసుకున్న నిర్ణయంతో 'అఖిల్' మూవీ వాయిదా పడినట్లు సమాచారమ్ అందుతుంది. వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సయేషా సెహగల్, అఖిల్ సరసన హీరోయిన్గా నటించింది. పాటలకు, పాటల్లో అఖిల్ డాన్సులకీ అక్కినేని అభిమానుల నుంచే కాక సినీ అభిమానులందరి నుంచీ మంచి స్పందన వస్తోంది. ఇదిలా ఉండగా 'అఖిల్' సినిమాని దీపావళి కానుగా విడుదల చేయాలనుకుంటున్నారట. కంప్లీట్ డిటెయిల్స్ ఇంకా రాలేదు.
|