పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో వస్తున్న వరుణ్ తేజ్ సినిమా 'లోఫర్'. ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్గా నటిస్తోంది. వరుణ్ తేజ్ మాస్లుక్లో ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాతో పూరీ చాలా కాలం తర్వాత విజయం సాధించాలని ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్తో అదరగొట్టేస్తున్నాడు వరుణ్. హీరోని మాస్లుక్లో ప్రెజెంట్ చేయడంలో పూరీది అందె వేసిన చెయ్యి. 'పోకిరి' సినిమాతో సాప్ట్గా ఉండే మహేష్ను రఫ్గా చూపించి బాక్సాఫీస్ బద్దలుకొట్టాడు.
ఇప్పుడు మెగా ప్రిన్స్తో మరో సారి బాక్సాఫీస్ షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. మదర్ సెంటిమెంట్ సినిమాలో మెయిన్ ఎలిమెంట్ అట. సెంటిమెంట్కి స్కోప్ ఉన్న సినిమా అయినప్పటికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి 'లోఫర్' సినిమాను డిఫరెంట్ స్టైల్లో తెరకెక్కించాడట పూరీ. షూటింగ్ పూర్తి చేసకుని సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు రెఢీ అయ్యింది ఈ సినిమా. 'ముకుంద', 'కంచె' సినిమాలతో చెప్పుకోదగ్గ విజయాల్నే సాధించిన వరుణ్ ఈ సినిమాతో ముచ్చటగా మూడో విజయాన్ని అది కూడా భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోనున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఆడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నెల 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|