'బ్రూస్లీ' సినిమా తర్వాత వస్తోన్న రామ్ చరణ్ మూవీ 'ధృవ'. తమిళ్ తనీఒరువన్'కి రీమేక్గా వస్తోంది ఈ సినిమా. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా దసరాకి విడుదల అయ్యే అవకాశాలున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ కధాంశంగా రూపొందుతోంది ఈ చిత్రం. రామ్ చరణ్ పోలీస్ గెటప్లో నటిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న చరణ్ తొలిసారిగా థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు ఈ సినిమాలో. ఇటీవల ఈ సినిమా ఫస్ట్లుక్ విడుదలైంది. అరతకుమించి ఈ సినిమాకి సంబంధించిన ఏ సమాచారమూ బయటికి రాలేదు.
అయితే వినాయక చవితి సందర్భంగా రాంచరణ్ 'ధృవ' టీజర్ని విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో హ్యాండ్సమ్ హీరో అరవింద్ స్వామి విలన్గా పరిచయం అవుతున్నాడు. తమిళంలోనూ అరవింద్ స్వామే విలన్గా నటించి మెప్పించాడు. విలన్నీ, హీరోకీ మధ్య జరిగే సన్నివేశాలు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిపోయే రేంజ్లో ఉంటాయట ఈ సినిమాలో. మాతృకలో పాటలు, ఎంటర్టైన్మెంట్ వంటి కమర్షియల్ హంగులు తక్కువే. కానీ చరణ్ కోసం తెలుగు వెర్షన్లో ఆ కమర్షియల్ హంగులన్నీ పూర్తిస్థాయిలో పొందుపర్చారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమాలో సురేందర్ రెడ్డి చాలానే మార్పులు చేశాడని సమాచారమ్.
|