2016 స్టార్టింగ్లో 'ఎక్స్ప్రెస్ రాజా' సినిమాతో సంక్రాంతి రేస్లోకి అడుగుపెట్టాడు యంగ్ హీరో శర్వానంద్. ఈ టైంలో ఆ రేస్లో ఉన్నదెవరో అందరికీ తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో..' సినిమాతోనూ, నందమూరి నటసింహం బాలయ్య 'డిక్టేటర్'తోనూ, నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాతోనూ బరిలో ఉన్నారు. ఇలాంటి స్టార్ హీరోల మధ్య ధైర్యంగా నేనేం తక్కువ కాదంటూ 'ఎక్స్ప్రెస్ రాజా' సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఇవ్వడమేనా గ్రాండ్ సక్సెస్ దక్కించుకున్నాడు. అందుకే అదే జోరు, సెంటిమెంట్తో 2017లో కూడా సంక్రాంతి బరిలోనే తన కాలు మోపుతానంటున్నాడు. మరి ఈ ఏడాది ఈ యంగ్ హీరో పోటీపడేదెవరో కూడా తెలుసుగా.
ఏకంగా మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణలతో. అయినా కానీ ఏమాత్రం తగ్గనంటున్నాడు శర్వానంద్. వేగేశ్న సతీష్ దర్శకత్వంలో వస్తోన్న శర్వానంద్ సినిమా 'శతమానం భవతి'. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాత. దిల్ రాజు సినిమా అంటే ఆషామాషీ కాదు. కథలో ఎంతో బలం ఉంటే కానీ దిల్ రాజు టేకప్ చేయడు. అందుకే అంత నమ్మకంగా ఈ సినిమాని స్టార్ హీరోలకి పోటీగా సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్కి మంచి వస్తున్న రెస్పాన్స్ అదిరిపోతోంది. అచ్చం పండగలా ఉంది ఆ ట్రైలర్. పల్లెటూరి వాతావరణంలో సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలతో ట్రైలర్ చూస్తేనే సంక్రాంతి కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. ఇక సినిమా ఇంకెంత ఆహ్లాదంగా ఉండబోతోందో అంటూ అంచనాలు వేస్తున్నారు. 'అ,ఆ..' బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ ఈ సినిమాలో శర్వానంద్కి జోడీగా నటిస్తోంది.
|