నాగార్జున ఓ ప్రముఖ నటుడు మాత్రమే కాదు. నిర్మాత కూడా. హీరోగానే కాకుండా పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన అనుభవం ఉంది ఆయనకు. సినీ పరిశ్రమకు సంబంధించి, అన్ని విషయాల్లోనూ అవగాహన ఉంది నాగార్జునకి. అందుకే వసూళ్ల విషయంలో ఆయన దగ్గర ప్రస్థావన వస్తే నిర్మొహమాటంగా చెప్పేశారు. 100 కోట్టు, 50 కోట్ల గురించి మాట్లాడుకోవడం అనవసరం ఇప్పుడు. ఎందుకంటే మన తెలుగు సినిమా స్థాయి ఇప్పుడు 1500 కోట్లు. 'బాహబలి ది కన్క్లూజన్' వంటి సినిమా తెచ్చి పెట్టిన ఖ్యాతి ఇది. తెలుగు పరిశ్రమ నుండి ఏ సినిమా వచ్చినా ఇదే స్థాయిలో వసూళ్లు సాధించాలనే టార్గెట్ ప్రధానంగా ఉండాలంటున్నారు నాగార్జున. అంటే ఆ స్థాయిలో వసూళ్లు లక్ష్యం కాదు, అంతలా తెలుగు సినిమా సత్తాని చాటే విధంగా మన సినిమా వ్యూహాలు ఉండాలని నాగ్ తెలిపారు. అనుభవం ఉన్న ఓ నిర్మాతగా నాగ్ చెబుతున్న మాటలివి.
ప్రతీ నిర్మాత ఇదే కోణంలో ఆలోచించాలి. 'బాహుబలి' సాధించిన విజయం వన్ అండ్ ఓన్లీ వండర్ కాకూడదు. ఇకపై మరిన్ని తెలుగు సినిమాలు ఇదే స్థాయిలో రూపొందాలి. ఇదే స్థాయిలో తెలుగు సినిమా సత్తాని దేశ దేశాల చాటుతూ, ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని నాగ్ అంటున్నారు. నాగార్జున ప్రస్తుతం 'రాజుగారి గది -2' సినిమాలో నటిస్తున్నారు. ఓంకార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సీరత్ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, సమంత కీలక పాత్ర పోషిస్తోంది ఈ సినిమాలో. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|