కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల ద్వారా ఓ మంచి మెసేజ్ని అందించే చేసే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. డైలాగ్ దగ్గర నుండి, పాట దగ్గర నుండీ, సన్నివేశం, ఫైట్స్ ఇలా ప్రతీ ఒక్కటీ ప్రత్యేకంగా ఉండాలనుకుంటాడు. 'అజ్ఞాతవాసి'తో తొలి సారి ఘోర పరాజయాన్ని చవిచూసిన ఈ దర్శకుడు మునుపటి ఫామ్తో 'అరవింద సమేత..' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్, పూజా హెగ్దే ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి 'పెనిమిటి..' అంటూ సాగే ఆడియో సింగిల్ విడుదలైంది. పాట విడుదలకు ముందే కొందరు సినీ ప్రముఖులు దీన్ని వినేశారు.
ఇంతకు ముందెన్నడూ విననంత హృద్యంగా పాటని మలిచారనీ లిరిక్స్ హృదయాన్ని తట్టి లేపుతాయనీ విన్న వాళ్లంతా చెప్పారు. దాంతో ఈ పాటలో ఏముంది? అని అందరూ ఎదురు చూశారు. పాట రానే వచ్చింది. పాటలోని ప్రతీ పదం నిజంగానే గుండె లోతుల్లోకి వెళ్లి పోయింది. ఓ భార్య తన భర్త కోసం పడే ఆవేదనను గేయ రచయిత కళ్లకు కట్టినట్లు చూపించాడు. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యాన్ని పాటలో పదునైన మాటల్లో చెప్పాడు. లిరిక్స్, మ్యూజిక్ వీటికి తోడు అద్భుతమైన గాత్రం ఈ పాటను నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లాయి. ఆల్బమ్ లో ఎన్ని హుషారైన పాటలున్నా, ఈ పాటకే ఎక్కువ మంది జో కొడతారని నిస్సందేహంగా చెప్పొచ్చు.
|